WestGodavari

News April 16, 2025

ప.గో: సమ్మర్ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి..

image

వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ప.గోజిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, సముద్ర తీరాలు మనసులను కట్టిపడేస్తాయి. భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ ధాం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రం, నత్తా రామేశ్వరం, దువ్వ దానేశ్వరీ అమ్మవారు, కాళ్ల సీసలి సాయిబాబా మందిరం, పేరుపాలెం బీచ్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు. మీరేమైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా కామెంట్ చేయండి.

News April 16, 2025

ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

image

విద్యాశాఖ పాఠశాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.

News April 16, 2025

కాళ్ల: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో టీచర్

image

కాళ్ల మండలం సీసలి హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న చెల్లుబోయిన పద్మ సంగీత వాయిద్య ప్రదర్శనల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబర్చిన పద్మకు హైదరాబాద్ హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించారు.

News April 16, 2025

ప.గో: సూర్యఘర్ పథకం అనుకున్నంతగా లేదు..కలెక్టర్ 

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం సీఎం సూర్యఘర్ పథకం అమలుపై జిల్లాలోని విద్యుత్ శాఖ ఈఈలు, డిఇలు, ఏఈలతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇప్పటివరకు14,392 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయగా, 917 గృహాలకు మాత్రమే సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ పథకం అమలు అనుకున్నంత వేగంగా జరగటంలేదని అసహనం వ్యక్తం చేశారు.

News April 14, 2025

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా చెరుకువాడ

image

వైసీపీ పీఏసీ సభ్యులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు దక్కింది. పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

News April 14, 2025

కొవ్వూరు: అప్పు అడిగినందుకు హత్య

image

ఇటీవల దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఇతని వద్ద పెద్దవం సచివాలయ సర్వేయర్ శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ పలుమార్లు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ కక్ష పెట్టుకుని మరో ఇద్దరి సాయంతో హత్య చేసి కుడి చేతికున్న బంగారం కోసం చేతిని నరికేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.

News April 14, 2025

కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

image

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 13, 2025

భీమవరంలో చికెన్ రేట్లు ఇలా.!

image

భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాలు చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ ధర రూ.800 నుంచి రూ .1000 మధ్యలో ఉంది. అలాగే చికెన్ కేజీ రూ. 240 – రూ.260 మధ్యలో ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News April 13, 2025

ప.గో: రెండు నెలలు చేపల వేట బంద్

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు నెలల పాటు చేపల వేట నిషేంధించినట్లు ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 13, 2025

భీమవరం : మహిళపై ఇద్దరి అసభ్య ప్రవర్తన

image

ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన భీమవరంలో జరిగింది. రాయలం గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. గురువారం ఆమె పని నుంచి ఇంటికి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కుమార్, అతని ఫ్రెండ్ ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ మేరకు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూ టౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు.