India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్ లో నిర్వహించిన మిస్ తెలుగు యు ఎస్ ఎ పోటిల్లో ఫైనల్ కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25 న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు.
పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఈదుబిల్లి నాగలక్ష్మి దుర్గ (18) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెనుగొండలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటి వద్దనే ఉంటోంది. గత కొంతకాలంగా తరచూ గుండెనొప్పితో బాధపడుతుండగా ఆమెకు శస్త్ర చికిత్స చేయించి మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో గురువారం నొప్పి ఎక్కువగా రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.
ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో బుధవారం జరిగిన సభలో MLA బొమ్మిడి నాయకర్ కారుమూరి, అంబటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట తీరు మార్చుకో. లేకుంటే తాటతీస్తాం. అంబటి రాంబాబు పద్ధతి మార్చుకోకుంటే నీ సొంత నియోజకవర్గంలో, కార్యకర్తల ముందే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష సమావేశం తాడేపల్లిగూడెం డీస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక నేరాల స్థితిగతులు, కీలక ఘటనలపై విచారణ, పురోగతి, నేరాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, రౌడీ షీటర్ల పై నిఘా, సైబర్ నేరాల నియంత్రణ అంశాలపై అధికారులతో ఎస్పీ సమగ్రంగా చర్చించారు.
గ్యాస్ ధరల పెంపు ప.గో జిల్లా సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోగదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
జిల్లాలో ఇప్పటివరకు 43 రైతు సేవా కేంద్రాలు ద్వారా 2,500 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టర్ ఛాంబర్లో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సహకార, వ్యవసాయ, రవాణా, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ, అగ్రికల్చర్ ట్రెండ్ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా కంట్రోల్ రూమ్ 8121676653 తెలియజేయాలన్నారు.
రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.