India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప రిమ్స్లో పనిచేసే మహిళను వైద్యశాఖలో పనిచేస్తున్న కృష్ణ 11ఏళ్ల క్రితం పెళ్లి కాలేదని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. బాధితురాలు సోమవారం కలెక్టరేట్ ముందు విషద్రావకం తాగడంతో పోలీసులు ఆసుప్రతికి తరలించారు. కృష్ణ గతంలో దాడి చేశారని చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కాగా కృష్ణ అన్నమయ్యలో డిప్యూటీ డీఎంహెచ్వోగా పని చేస్తున్నాడు.
ఈనెల 11న అండర్ -14 పురుషుల కడప జిల్లా జట్టు ఎంపికలు కడప నగరంలోని వై.ఎస్. రాజారెడ్డి స్టేడియంలోని క్రికెట్ నెట్స్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమతో పాటు ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజ్ ఫొటో,తెచ్చుకోవాలన్నారు.
ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్ట్యా కాచిగూడ-కొల్లాం-కాచిగూడ రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి 14వ తేదీ సాయంత్రం రైలు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12.38కు కడపకు కి చేరుకొని రేణిగుంట, కాట్పడి, త్రిశూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్ట్యా కాచిగూడ-కొల్లాం-కాచిగూడ రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి 14వ తేదీ సాయంత్రం రైలు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12.38కు కడపకు కి చేరుకొని రేణిగుంట, కాట్పడి, త్రిశూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పులివెందులలోని ‘మా ఊరి సినిమా’ చిత్ర హీరో మహేశ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీ ఖానా వెనక భాగంలో మహేశ్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.
కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో నేడు పోలీసులు బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. జిల్లా పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎస్పీ కార్యాలయానికి ఎవరూ రావొద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామపంచాయతీకి చెందిన గాజుల భాస్కర్ నియమితులయ్యారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీ బలోపేతం కోసం పనిచేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని భాస్కర్ తెలిపారు.
కడప జిల్లాలోని ఇసుక రీచులలో ఇసుక సరఫరాను ప్రభుత్వ తాజా నియమ నిబంధనలకు అనుగుణంగా సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా, కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శివ శంకర్ పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అండర్-18, 20, 23 మహిళలకు, పురుషులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.
Sorry, no posts matched your criteria.