India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు, బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉదయం 9-30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
సిద్దవటం మండలంలోని ముమ్మడిగుంటపల్లిలో శనివారం విషాదం నెలకొంది. గ్రామస్థుల వివరాల ప్రకారం వ్యవసాయ పొలాల్లోని బావిలో శనివారం ఈతకొడుతూ 10వ తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు మృతి చెందాడు. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసులు స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లి వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకొడుతూ బయటకు రాగానే ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన నాగరాజు అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఛైర్మన్లను ప్రకటించింది. అందులో 31 టీడీపీ, 6 జనసేన, బీజేపీకి ఒకటి కేటాయించింది. ఇందులో బీజేపీ తరఫున యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా రామిరెడ్డికి ఈ అవకాశం లభించింది. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.
కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లా పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఇతర కేటగిరి నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందడానికి సీనియార్టీ జాబితాను రూపొందించినట్లు DEO షేక్ శంషుద్దీన్ తెలిపారు. సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాత పూర్వకంగా ఆధారాలతో సంప్రదించాలని సూచించారు.
కడప జిల్లా పరిధిలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమ పేర్లు ఈ శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి అని ఉప కమిషనర్ శ్రీకాంత్ నాయక్ పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకొనుటకు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు.
మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు.
పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.
Sorry, no posts matched your criteria.