Y.S.R. Cuddapah

News October 7, 2025

కడపలో యువతి ఆత్మహత్యాయత్నం

image

కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

News October 7, 2025

పులివెందులలో MP అవినాశ్ ప్రజా దర్బార్

image

కడప పార్లమెంట్ సభ్యుడు YS అవినాశ్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను ఎంపీకి తెలియజేశారు. ప్రజల ఆవేదనను ఆలకించిన అవినాశ్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వీరివెంట ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చినా నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్

image

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నిబంధనల అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఏవైనా భద్రత సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 5, 2025

తనిఖీలు చేపట్టిన కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ఘటన నేపథ్యంలో కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం లేబుళ్లను తనిఖీ చేశారు. మద్యం బాటిళ్ల మూతలను, సీళ్లను పరిశీలించారు. ప్రొద్దుటూరులోని మద్యం దుకాణాల్లో మద్యం లేబుళ్లను పరిశీలించినట్లు ఎక్సైజ్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో నకిలీ మద్యం లేదని జిల్లా ES రవికుమార్ స్పష్టం చేశారు.

News October 4, 2025

కడప: కన్ఫ్యూజన్‌లో ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు

image

కడప జిల్లాలోని ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. జమ్మలమడుగు, బద్వేల్‌లో ఇద్దరిద్దరు నేతలు సమన్వయకర్తలుగా ఉండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కార్యకర్తలు సందిగ్ధంలో పడుతున్నారు. జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య, బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డిల మధ్య ఇన్‌ఛార్జ్ పదవి కోసం పోరు సాగుతోంది.

News October 4, 2025

రేపు కడప జిల్లాకు రానున్న మంత్రి సవిత

image

కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత శనివారం కమలాపురం రానున్నట్టు టీడీపీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కూటమి ప్రభుత్వం శనివారం ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయనుంది. కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమె రానున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పాల్గొననున్నారు.

News October 3, 2025

ప్రొద్దుటూరు డిపోలో రూ.64.84 కోట్ల మద్యం అమ్మకాలు

image

ప్రొద్దుటూరు మద్యం డిపోలో గత నెలలో రూ.64,84,23,961 మద్యాన్ని విక్రయించారు. 90,917 కేసుల మద్యం(IML), 41,051 కేసుల బీర్లను విక్రయించారు. ప్రొద్దుటూరులో రూ.17,38,10,481, బద్వేల్‌లో రూ.10,19,74,024లు, జమ్మలమడుగులో రూ.6,44,49,207, ముద్దనూరులో రూ.3,65,34,335లు, మైదుకూరులో రూ.8,69,16,893, పులివెందులలో రూ.11,27,65, 246, ఎర్రగుంట్లలో రూ.7,19,73,773 మద్యం కొనుగోలు జరిగింది.