Y.S.R. Cuddapah

News September 8, 2024

కడప: ఈనెల 10న జాబ్ మేళా

image

కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, జమ్మలమడుగులోని న్యాక్ కేంద్రంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 8, 2024

కడప: మహిళకు అరుదైన శస్త్రచికిత్స

image

కడపలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలకంఠరావు పేటకి చెందిన మహిళ గత నాలుగు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల్ని సంప్రదించగా పరీక్ష చేసి కడుపులో సుమారు ఫుట్ బాల్ సైజులో రెండు కిలోల పైగా ఉన్న కణితిని గుర్తించారు. ఈ కణితిని కడపలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.

News September 8, 2024

సిద్దవటం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి బొగ్గిడివారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఆటో ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా.. నలుగురు గాయాలయ్యాయి. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 8, 2024

ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. కడప SP

image

వినాయక చవితి పండుగ నేపథ్యంలో వినాయక మండపాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలను కోరారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీసు శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేశామని, అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రజలు వారి విలువైన ఆభరణాలు వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్లు, ఇతర వస్తువుల దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News September 7, 2024

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్

image

గత రెండు రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహించినట్లు రేంజర్ కళావతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. సిద్దవటం లంకమల అభయారణ్యంలోని గొల్లపల్లి బీటులో తాపల రస్తా, ఏటిమడుగు, నిమ్మకాయల బండతో పాటుగా.. సమస్యాత్మక ప్రదేశాలలో రెండు రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహించామన్నారు. ఈ కూంబింగ్‌లో డిప్యూటీ రేంజర్ కే ఓబులేసు, గొల్లపల్లి FBO, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 7, 2024

కడప: డోజర్ ఢీకొని వ్యక్తి మృతి

image

కడప జిల్లా పెద్దముడియం మండలంలో శనివారం విషాదం నెలకొంది. పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పెరుమాళ్ల దిలీప్(25) జమ్మలమడుగు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డోజర్ ఢీకొంది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వినాయక చవితి పండుగ నాడే యువకుడు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 7, 2024

కడప: డోజర్ ఢీకొని వ్యక్తి మృతి

image

కడప జిల్లా పెద్దముడియం మండలంలో శనివారం విషాదం నెలకొంది. పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పెరుమాళ్ల దిలీప్(25) జమ్మలమడుగు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డోజర్ ఢీకొంది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వినాయక చవితి పండుగ నాడే యువకుడు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 7, 2024

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆర్జిత సేవలు రద్దు

image

ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆర్జిత సేవలను రెండు నెలల పాటు రద్దు చేసినట్లు తనిఖీ అధికారి నవీన్ కుమార్ శుక్రవారం తెలిపారు. గర్భాలయంలోకి భక్తులను నిలిపివేస్తామని తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కల్యాణం, అర్చన సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

News September 7, 2024

నేడు కడప జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కడప జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

News September 7, 2024

కడప: 17 నుంచి 21 వరకు గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

గుంటూరు-తిరుపతి-గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. గిద్దలూరు, దిగువమెట్ట మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గుంటూరు, తిరుపతి మధ్య నడిచే రైలు 17 నుంచి 21 వరకు, తిరుపతి, గుంటూరు మధ్య నడిచే రైలు 18 నుంచి 21 వరకు రద్దు చేశారన్నారు.