India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి నగరపాలక సంస్థ అధికారులను అభినందించారు.
కడప జిల్లా ముద్దనూరుకి చెందిన సుంకన్న అనే వ్యక్తి రేపు పండగ కావడంతో హాస్టల్ నుంచి పిల్లలను తీసుకురావడానికి మైలవరం వచ్చాడు. అనంతరం ఇద్దరు కూతుర్లతో ముద్దనూరు వెళ్తుండగా.. మార్గమధ్య సుంకన్నకు BP డౌన్ అయి బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడ్డాడు. దీంతో 5వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు సుమ (10) అక్కడికక్కడే మృతి చెందగా.. 2వ కూతురు సుప్రియకి తీవ్ర గాయాలు కాగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
వైవీయూ జియాలజీ, ఎర్త్ సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు దువ్వూరు మండలం రామాపురం వ్యవసాయ భూమిని సందర్శించారు. రైతు మానుకొండ వెంకట శివ వ్యవసాయ భూమిలో 15 అడుగుల లోతు మేర కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జియాలజీ శాఖ సహ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. సున్నపురాతి పొరలు భూగర్భంలో జరిపిన చర్య ఫలితంగా భూమి కుంగిందన్నారు.
పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెలరోజులుగా ఒక్క కాన్పు కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసంలో ఆరోగ్య కేంద్రంలో కనీసం 10 కాన్పులు నమోదయ్యేలా స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెలరోజులుగా ఒక్క కాన్పు కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసంలో ఆరోగ్య కేంద్రంలో కనీసం 10 కాన్పులు నమోదయ్యేలా స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
మంత్రి మండిపల్లి నేడు ఇసుక తవ్వకాల కేంద్రాలను ప్రారంభించనున్నారు. చెయ్యేరు నదీ తీరంలో బుడుగుంటపల్లి వద్ద 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె వాసులు పేర్లు నమోదుకు సానిపాయి సచివాలయం, రాజంపేట, రైల్వేకోడూరు వాసులకు కూచివారిపల్లి సచివాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టన్ను ఇసుకకు రూ. 328 చెల్లించాలన్నారు.
వెలిగల్లు జలాశయంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించామని ప్రాజెక్టు డీఈఈ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఈ ప్రాజెక్టు ద్వారా లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, రాయచోటి మండలాలకు సాగు, తాగు నీటిని అందించాల్సి ఉంది. నిమజ్జనం చేస్తే విగ్రహాలకు వినియోగించే రంగులు, రసాయనిక పదార్థాలతో నీటి కాలుష్యం జరుగుతుంది. జల కాలుష్య నివారణలో భాగంగా ప్రాజెక్టులో నిమజ్జనాన్ని నిషేధించాం’ అని డీఈఈ తెలిపారు.
సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయడం వల్ల గొప్ప మార్పులు సాధించవచ్చని ఆయన ప్రజలను కోరారు. చెరువులు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దామని, మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు.
కడప జిల్లాలో గంజాయి నిర్మూలనకు విస్తృతంగా దాడులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. జిల్లాలో గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిఎన్సీసీ (డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్) టీంతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి జిల్లాలోకి రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వేంపల్లెకు చెందిన కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఆకుపచ్చ ముగ్గు’ కథను ఏపీ ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై B.A, B.Com, B.Sc, B.B.A చదువుతున్న విద్యార్థులు 3వ సెమిస్టర్ కింద చదువుకోవాల్సిన పాఠ్యాంశాల్లో వేంపల్లె షరీఫ్ కథ కూడా ఉంటుంది.
Sorry, no posts matched your criteria.