India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ షర్మల నివాళులర్పించారు. అనంతరం తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ‘ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా నాన్న మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారు. నాన్న ఆశయాలే .. లక్ష్య సాధనగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయి.’ అని Xలో పోస్ట్ చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం తన తండ్రిని గుర్తు తెచ్చుకుని ‘We miss you, Dad’ అని ట్వీట్ చేశారు. దీనికి నివాళి అర్పించిన ఫొటోలను జత చేశారు.
ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నరేశ్ బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంలో వివిధ కరణాల వల్ల, తెలిసీ తెలియక జరిగిన దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.
తొండూరు మండలంలో 2 చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం సైదాపురం, ఆడపూరు మధ్యలో గల నాగలకట్ట సమీపంలోని ఇసుకమెట్టల వద్ద చిరుత పులి కనిపించిందని గ్రామస్థులు, పశువుల కాపరులు తెలిపారు. ఆదివారం ఇనగలూరు, సైదాపురం వాగులో 2 చిరుతపులులు సంచరిస్తుండగా పశువుల కాపర్లు చూసి స్థానికులకు తెలుపగా వారు వెంటనే సంబంధిత అటవీశాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు ఇడుపులపాయలో YS జగన్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం పులివెందుల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు. సంబంధిత యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి పులివెందులలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో ప్రజలు ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధి బాధితులు ఆయనను కలిసి తమ సమస్యలను తెలియజేశారు.
నరసాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసే పత్తి సత్యనారాయణ శనివారం రోజు మాదిరే వారి డ్యూటీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో బద్వేల్కు వెళ్తుండగా ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుక వెళ్లేలోపే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు సత్యనారాయణకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి అమెరికాలో ఏడాదికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించారు. ఆమె జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపి దుర్గాపూర్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తిచేశారు. అనంతరం అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు.
Sorry, no posts matched your criteria.