Y.S.R. Cuddapah

News August 30, 2024

రాయచోటి: గిరిజన నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

అమెజాన్ కంపెనీ ఆధ్వర్యంలో వేర్ హౌస్ అసోసియేట్‌గా పనిచేసేందుకు అన్నమయ్య జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంగ్లిషు పై అవగాహన ఉన్నవారు అర్హులని తెలిపారు. సెప్టెంబరు 9 లోగా జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.

News August 30, 2024

ఆరోగ్యం కోసం క్రీడలు చాలా ముఖ్యం: కడప కలెక్టర్

image

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కోటిరెడ్డి సర్కిల్ ప్రాంగణంలో 3కె రన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థి, యువత దశలో క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

News August 29, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

➤ కడప జిల్లా వ్యాప్తంగా ITIలో కౌన్సెలింగ్
➤ బీటెక్ రవికి ఎమ్మెల్సీ?
➤ సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
➤ కడప జిల్లాలో పర్యటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
➤ వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మేడా రఘునాథ్ రెడ్డి
➤ బీజేపీలోకి ఎర్రగంగిరెడ్డి.. స్పందించిన పురందీశ్వరి
➤ కడప: JNTU కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
➤ పులివెందులలో భారీగా మద్యం పట్టివేత
➤ కొండాపురం వద్ద రెండు లారీల ఢీ

News August 29, 2024

కడప: బంగారు చైన్ చోరీ చేసిన ఆటో డ్రైవర్ అరెస్టు

image

ఆటోలో వెళ్తున్న మహిళలు ఏమార్చి బంగారు చైన్ దొంగతనం చేసిన ఆటో డ్రైవర్ ను కడప చిన్న చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ తేజ మూర్తి తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్ పరిధిలోని మద్రాస్ రోడ్డులోని చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఏమార్చి మహిళ వద్ద ఉన్న బంగారు చైన్‌ను డ్రైవర్ జఫర్ దోచుకెళ్లారు. ఇవాళ విచారణ చేసి అతని వద్ద నుంచి 51 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

News August 29, 2024

కడప: కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

image

ఖాజీపేట మండలం అప్పనపల్లికి చెందిన ప్రవీణ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలికిరిలోని JNTUలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ ర్యాగింగ్‌కు గురయ్యాడు. మనస్థాపన చెంది ఈనెల 23న ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన బాధను ఇంట్లో చెప్పుకోలేక 26న పురుగు మందును తాగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందుతుండగా ఇవాళ ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.

News August 29, 2024

వైసీపీని వీడేది లేదు: మేడా

image

ప్రస్తుతం వైసీపీ నేతల రాజీనామాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి కూడా పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నేను వైసీపీని వీడేది లేదు. నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాజకీయాలు ఉన్నంత వరకు వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

News August 29, 2024

సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు YS షర్మిల

image

పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1న హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి 2న వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని, వైఎస్సార్ ఘాట్‌లో తండ్రికి నివాళులర్పించనున్నారు. 2,3 తేదీలలో జిల్లాలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని 4న విజయవాడ తిరుగుపయనం అవుతారని ఆపార్టీ నేతలు తెలియజేశారు.

News August 29, 2024

MLC సునీత రాజీనామా.. ఆ స్థానంలో బీటెక్ రవి?

image

వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్‌పై ఓడిపోయిన విషయం తెలిసిందే.

News August 29, 2024

కడప: నేడు జిల్లా వ్యాప్తంగా ITIల్లో కౌన్సిలింగ్

image

కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో 3వ విడత అడ్మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు వారు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఐటీఐలలో కౌన్సిలింగ్ జరుగుతుందని ప్రభుత్వ మైనారిటీ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్‌తోపాటు ఫోటో, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.

News August 29, 2024

కడప: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేయాలి

image

ఎంఎస్ఎంఈ 1989 యాక్ట్ నిబంధనల మేరకు.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ, జిల్లా విపత్తుల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.