India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు కోర్టులో నిన్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివా రెడ్డి శుక్రవీణను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సాప్ట్వేర్ ఇంజినీర్లు అయిన భార్యాభర్తలు చిన్నపాటి వివాదంతో విడిపోయారు. భార్య జాతీయ లోక్ అదాలత్ను ఆశ్రయించగా జడ్జి సత్యకుమారి భర్తతో మాట్లాడారు. జడ్జి సూచనలతో భార్యాభర్తలు ఒకటయ్యారు.
తన బిడ్డ మృతిపై దుష్ర్పచారం చేయడం బాధాకరమని YS అభిషేక్ రెడ్డి తండ్రి YS మదన్ మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘వివేకా హత్య కేసు సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోతున్నారని కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారం చేస్తున్నాయి. నా కుమారుడు అనారోగ్యంతోనే చనిపోయాడు. గంగిరెడ్డి, వాచ్మెన్ రంగన్న సైతం ఆరోగ్యం సరిగా లేక కన్నుమూశారు. ప్రభుత్వం సిట్ అంటోంది. అది కాదు జ్యుడీషియల్ విచారణ చేపట్టండి’ అని ఆయన కోరారు.
జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలను బలోపేతం చేసి ముందుకు నడిపించాలని బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. శనివారం కడపలోని ఆర్& బి అతిధి గృహంలో.. బీసీ సంక్షేమ శాఖాధికారులు, చేనేత జౌళిశాఖ అధికారులతో.. సమీక్షా సమావేశం నిర్వహించారు. సవిత మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు.
అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామనున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కె.వి పల్లి మండలం, మహల్ క్రాస్ టర్నింగ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాయచోటి నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో పాల వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని డ్రైవర్ ఢిల్లీబాబు(33), టి.వెంకటేశ్ (23) మృతి చెందారు. మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.
వేంపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్లపై పీజీటీ ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాళ్లతో తన్నినట్లు మహిళా టీచర్లు సునీత, అంజలి పేర్కొంటున్నారు. దీనిపై శుక్రవారం వేంపల్లె పోలీస్ స్టేషన్లో గుర్నాథ్ రెడ్డిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్యను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మండలంలోని ఉప్పరపల్లె గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. శేఖరాజుపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే సంఖ్య 421/1, 424 లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇక్కడ సుమారు 50 సెంట్లను ఇటీవల స్థానికుడు యంత్రంతో చదును చేసి ఆక్రమించాడు. ఈ విషయమై ఇన్ఛార్జ్ MRO మాధవీ లతను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు.
వైయస్సార్ కడప జిల్లా పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (58), వెంకట ఆంజనేయులు(55) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జీవో 117 ఉపసంహరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందడమే కాకుండా.. వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేయనుందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జీవో 117 ఉపసంహరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సన్నాహక మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ, నివేదికల సమర్పణ తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ ఒప్పంద అధ్యాపకుడు తిరుపతిరావుపై విద్యార్థిని ఫిర్యాదు మేరకు స్థానిక ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడు తిరుపతిరావు రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Sorry, no posts matched your criteria.