India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కడపలోని స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల గురువారం జాతీయ క్రీడా దినోత్సవ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ముందస్తుగా బుధవారం విద్యార్థులతో NATIONAL SPORTS DAY, APSWERS B.MATTAM అనే ఆకృతితో కూర్చున్నారని కళాశాల ప్రిన్సిపల్ పద్మనాభ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కడప నగర మేయర్ సురేశ్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రభస చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో నిధులు లేనప్పుడు దానిని నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ఎర్రగుంట్ల మండలం కలమలకు రానున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని కలమలలో ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంటకు చేరుకొని, అక్కడి నుంచి రైలులో 11.35కు ఎర్రగుంట్లకు వస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కలమలకు చేరుకుంటారు.
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ఘటనలో.. <<13943581>>భార్యతో సహా ప్రియుడిని అరెస్టు<<>> చేసినట్లు ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. లింగంపల్లె గ్రామానికి చెందిన గంగయ్య, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గంగయ్య వాటర్ పంప్ వద్ద పనిచేస్తున్నారు. అయితే సంధ్యకు ఇదే గ్రామానికి చెందిన బలరాముడికి వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలుసుకున్న భర్త గంగయ్య మందలించారు. దీంతో ప్రియుడితో కలిసి ఆమె భర్తను హతమార్చింది.
కడప నగర మేయర్ కె సురేశ్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఆందోళన చేయడంతోపాటు, కొందరు చెత్తను ఇంటిలోకి విసిరేశారని బాధ్యులైన వారిపై మేయర్ ఫిర్యాదు చేయగా.. TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, ఇంకా 14 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కడప నగర మేయర్ కె సురేశ్ బాబు, తమ సహచరులు చిన్నచౌక్ పోలీసు స్టేషన్ వద్ద న్యాయంకోసం బైఠాయించారు. తరువాత పోలీసులు మేయర్తోపాటు, మరో 14మందిపై కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను 1వ తేదీనే 100 శాతం అందించేలా చర్యలు తీసుకోవాలని, కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. వితంతువులు, వృద్ధులు, కిడ్నీ బాధితులు పెన్షన్ అందుకునే ప్రతి లబ్ధిదారునికి, ఒకటవ తేదీన అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జేసీ అదితి సింగ్తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జేసీ అదితి సింగ్తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.
ఈనెల 29న కలమల్లలో తెలుగు భాషా దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఈ వేడుకలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి తెలుగు శాసనాలు అభ్యమైన కలమల్ల గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించున్న, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఎలాంటి కొరత లేకుండా జయప్రదం చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.