Y.S.R. Cuddapah

News September 5, 2025

తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కలెక్టర్

image

కడప జిల్లా విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల స్పష్ఠమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమైనదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాప్రదాతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

News September 5, 2025

కొండాపురంలో పూణే -కన్యాకుమారి రైలు హాల్టింగ్

image

ప్రయాణికుల సౌకర్యార్థం కడప MP వైయస్ అవినాశ్‌రెడ్డి వినతి మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో కొత్తగా 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూణే -కన్యాకుమారి -పూణే (16381/82) మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలు కొండాపురంలో ఒక నిమిషం పాటు ఆగనుంది. (17622) తిరుపతి- ఔరంగాబాద్ రైలుకు ఎర్రగుంట్లలో హాల్టింగ్ కల్పించారు. ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

News September 5, 2025

పథకాల అమలును పరిశీలించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం CS వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సీఎస్ సూచనల మేరకు జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పనులపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News September 5, 2025

ఇడుపులపాయ: మినిమం టైమ్ స్కేల్ జీఓపై హర్షం

image

గత 15 ఏళ్లుగా నిబద్ధతతో ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో నాన్‌టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ జీఓ మంజూరయ్యింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతను కాపాడినందుకు సీఎం చంద్రబాబు, డీసిఎం పవన్ కళ్యాణ్, జీఓ అమలులో సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 4, 2025

ప్రొద్దుటూరు: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషులకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు. 100M, 200M, 400M, 1000M పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

News September 4, 2025

ప్రొద్దుటూరు: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషులకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు. 100M, 200M, 400M, 1000M పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

News September 4, 2025

ప్రొద్దుటూరు: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషులకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు. 100M, 200M, 400M, 1000M పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

News September 4, 2025

కడప: ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా

image

జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి ఈనెల 8న నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం పది గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ జ్ఞాన కుమార్ గురువారం తెలిపారు. పదవ తరగతి, ITI మార్కుల జాబితా, NTC, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌, పాస్ పోర్డ్ సైజ్ ఫొటోలు, ఒక సెల్ఫీ ఫొటో తీసుకురావాలని సూచించారు. స్టై ఫండ్ రూ.7700 నుంచి రూ.10000 వరకు ఉంటుందన్నారు.

News September 4, 2025

కడప: నేటి నుంచి మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్ల ప్రారంభం

image

జిల్లాలో ఉల్లి పంటను సాగుచేసిన రైతులు ఈ క్రాప్ చేయించుకుని ఉంటే అటువంటి వారికి ప్రభుత్వం గురువారం నుంచి ఉల్లి కొనుగోలు చేస్తుందని జేసీ ఆదితి సింగ్ గురువారం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటా ఉల్లి ధర రూ.1200 మాత్రమే అని, కమలాపురం, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News September 4, 2025

సెలవులో వెళ్లనున్న కడప కలెక్టర్

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వ్యక్తిగత పని నిమిత్తం సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు యూకేకి వెళ్తున్నారు. ప్రస్తుత జేసీ అదితి సింగ్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.