Y.S.R. Cuddapah

News September 4, 2025

9న కడపలో గండికోట ముంపు వాసుల సమీక్ష.!

image

గండికోట ముంపు వాసుల సమీక్ష సమావేశం ఈనెల 9న కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో కొండాపురం మండలంలోని ఓవన్నపేట, చౌటపల్లి, బొమ్మపల్లి మరో 11 గ్రామాల గృహాల పునరావాస పరిహారంపై చర్చించనున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, అధికారులు పాల్గొంటారు. వీరితోపాటు కొంతమంది ముంపు బాధితులు వెళ్లనున్నారు.

News September 3, 2025

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా కడప జిల్లా నుంచి ముగ్గురు

image

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను  ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బి.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT షేక్ జవహర్ మునీర్‌లు అవార్డుకు ఎంపికయ్యారు.

News September 3, 2025

కడప: చిన్నారిని అంగన్వాడీ స్కూల్లో ఉంచి తాళం వేసిన టీచర్

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం PCపల్లి అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థినిని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన బుధవారం జరిగింది. హరికృష్ణ అనే విద్యార్థి ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థి ఇంటికి రాకపోవడంతో వెతికారు. చివరికి అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి చూడగా బాబు లోపల సృహతప్పి పడిపోయి ఉన్నాడు. ఈ ఘటనపై టీచర్ చంద్రకళను ప్రశ్నించగా సమాదానం లేదన్నారు.

News September 3, 2025

AUTO MATE యాప్‌ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

image

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్‌ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.

News September 3, 2025

AUTO MATE యాప్‌ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

image

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్‌ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.

News September 3, 2025

బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.

News September 3, 2025

కమలాపురం: స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం

image

కడప జిల్లాలో ఏర్పాటు కానున్న స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10332 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకం కింద విద్యార్థులకు భోజనాన్ని అందించనున్నారు. కాగా చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. కమలాపురంలో-2, జమ్మలమడుగులో-2, కడపలో-1 స్మార్ట్ కిచెన్‌ల ద్వారా 13 వాహనాల ద్వారా భోజనాన్ని అందించనున్నారు.

News September 3, 2025

జగన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు

image

YSR వర్ధంతి వేడుకలకు, జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం YS జగన్ పర్యటనలో మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు ప్రత్యేకంగా నిలిచింది. మంగళవారం ఉదయం జగన్ పులివెందుల పర్యటనలో ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అని మహిళలు ప్లకార్డును ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు వైపు జగన్ ఆసక్తిగా చూశారు.

News September 2, 2025

కడప: అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి లోకేశ్‌కు వినతి

image

అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచి ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేశ్‌ను అంగన్వాడీలు కలిశారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇoదుకు స్పందించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే వేతనాలు పెంచుతామన్నారు.

News September 2, 2025

చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

image

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.