Y.S.R. Cuddapah

News March 25, 2026

YSRకు నివాళులు అర్పించిన షర్మిల

image

AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాటు నందు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

News March 25, 2026

YSRకు నివాళులు అర్పించిన షర్మిల

image

AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాటు నందు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

News March 25, 2026

YSRకు నివాళులు అర్పించిన షర్మిల

image

AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాటు నందు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

News March 25, 2026

కడప జిల్లా రాజకీయాల్లో పురుషాధిక్యతకు గండి.!

image

ఉమ్మడి కడప(D)లో ఇప్పటి వరకు పులివెందుల, బద్వేల్, కడప, రాజంపేట, కోడూరు నుంచే మహిళలు MLAలుగా ఉన్నారు. ప్రస్తుతం KDP, BDVL నుంచి మహిళలు MLAలుగా ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్ అమలు అయితే వీరి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ స్థానాల ప్రకారం జిల్లాలో ఏకకాలంలో ఒక MP, ఐదుగురు మహిళలు MLAలుగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో జిల్లా రాజకీయల్లో పురుషాధిక్యతకు బ్రేక్ పడనుంది.

News March 25, 2026

మారనున్న కడప రాజకీయ ముఖచిత్రం

image

నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి కడప జిల్లాలో కొత్తగా 1MP, 4 MLA స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో పార్లమెంట్ స్థానాలు 3, అసెంబ్లీ నియెజకవర్గాలు 14 కానున్నాయి. మహిళలకు 1 MP, 5 MLA స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. జిల్లాలో ఇప్పుడున్న SC నియోజకవర్గాలు మారడం, కొత్తవి ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో MLAలు, మాజీ MLAలు, ఆశావహులు తమ స్థానాలు గల్లంతవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారు.

News March 25, 2026

రాజంపేట MP తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

image

MP మిథున్ రెడ్డి తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే GOVT బిల్లులను విడుదల చేయలేదన్నారు. దీన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.

News March 24, 2026

రేపు ఒంటిమిట్టలో పసుపు దంచే కార్యక్రమం

image

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. దేనితో కళ్యాణ ఘట్టానికి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పసుపును ఆలయంలో దంచుతారు. ఈ పసుపును స్వామివారి ముత్యాల తలంబ్రాలకు వినియోగిస్తారు.

News March 24, 2026

నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరి లెక్కలు వారివే.!

image

కడప జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. భౌగోళిక, జనాభా, ఓటర్ల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చని చర్చ సాగుతోంది. దీనిపై రాజకీయ నాయకులు, అనుచరులు, ప్రజలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కలు తీస్తున్నారు. కడప-2,84,548, ప్రొద్దుటూరు-2,48,324, జమ్మలమడుగు-2,42,749, పులివెందుల-2,30,235, బద్వేల్-2,20,804, మైదుకూరు-2,12,380, కమలాపురం-2,05,019 ఓటర్లు ఉన్నారు.

News March 24, 2026

కడప: కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా?

image

ఉమ్మడి కడప జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన కడప రూరల్, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్లలో ఒకటి. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉండటం, రైల్వే, రోడ్డు మార్గాలు ఉండటంతో ఎర్రగుంట్ల కూడా నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. ఇక నందలూరు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఏవి నియోజకవర్గాలు అవుతాయో చూడాలి.

News March 24, 2026

కడప: జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ‘స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్’

image

కడప జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్‌‌కు గాను కలెక్టర్ శ్రీధర్ ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు (India’s Honest Independent Honour)కు ఎంపికయ్యారు. మార్చి 28న న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగే 106 వ స్కోచ్ సమ్మిట్‌ అవార్డు ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ అవార్డును స్వీకరించనున్నారు.