Y.S.R. Cuddapah

News March 24, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,450
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.13,294
* వెండి 10 గ్రాములు ధర రూ.2,275.

News March 24, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,450
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.13,294
* వెండి 10 గ్రాములు ధర రూ.2,275.

News March 24, 2026

ఉమ్మడి కడప జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

image

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో <<19460921>>10 అసెంబ్లీ<<>> స్థానాలు ఉండగా ఆ సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.

News March 23, 2026

కడప: ఇవాళ్టి పరీక్షకు 27,677 మంది హాజరు!

image

కడప జిల్లాలో 167 కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి గణితం పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 27,861 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,677 మంది పరీక్షలు రాశారు. 184 మంది ఆబ్సెంట్ అయ్యారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 సెంటర్లను, 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలు జరిగాయి. 2,386 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,989 మంది రాశారు. 397 మంది గైర్హాజరయ్యారు.

News March 23, 2026

కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

image

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.

News March 23, 2026

కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

image

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.

News March 23, 2026

కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

image

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.

News March 23, 2026

కోదండ రాముని సన్నిధిలో TTD జేఈవో

image

ఒంటిమిట్ట కోదండ రామయ్యను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద బ్రహ్మోత్సవాలకు చేస్తోన్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలను, సలహాలు అందజేశారు.

News March 23, 2026

మార్క్ ఫెడ్ కొన్నది గోరంత.. కొనాల్సింది కొండంత.!

image

కడప జిల్లాలో రబీలో వాతావరణం అనుకూలించడంతో 88,114 హెక్టార్లలో శనగ పంట సాగు జరిగింది. ఎప్పుడూ లేని విధంగా హెక్టారుకు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక మార్కెట్లో రేటు పడిపోయింది. దాంతో ప్రభుత్వం రూ.5,875లు MSP ప్రకటించింది. జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టింది. ఇప్పటి వరకు కేవలం 13,460MTలు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన పంట రైతుల వద్ద చాలా ఉంది.

News March 23, 2026

కడప ఆర్డీఓగా మురళీ బాధ్యతలు

image

కడప నూతన ఆర్డీవోగా ఏ.మురళీ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన ఏ. మురళీని కార్యాలయ అధికారులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.