India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వృద్ధాప్యంలో తమను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కూతురే క్షోభకు గురుచేస్తోందని ప్రొద్దుటూరు (M) భగత్ సింగ్ కాలనీలోని మస్తానయ్య, దస్తగిరమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారిని చదివించి వివాహాలు చేశారు. 4 నెలల క్రితం పెద్ద కూతురు తమ బాగోగులు చూసుకుంటుందని నమ్మించి ఇంటిని రాయించుకుంది. ఆ తర్వాత తమని పట్టించుకోలేదని, న్యాయం చేయాలని వారు జమ్మలమడుగు RDOను ఆశ్రయించారు.

దూవ్వురు మండలం భీమునిపాడులో సోమవారం హత్య జరిగింది. తాను ఇచ్చిన రూ.10 వేలు తిరిగి చెల్లించమని దస్తగిరిని స్నేహితుడు దివాకర్ అడగడంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. దీంతో దివాకర్ తలపై దస్తగిరి గట్టిగా రాయితో కొట్టాడు. గాయాలపాలైన అతడిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దివాకర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కడప జిల్లాలో ఆగస్ట్ నెలలో మద్యం అమ్మకాల ద్వారా రూ.95.47 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లకు గత నెలలో 1,35,530 కేసుల మద్యం (IML), 62,134 కేసుల బీరు సరఫరా చేశారు. ప్రొద్దుటూరు డిపో నుంచి రూ.68.34 కోట్ల విలువైన 97,865 కేసుల IML, 42,477 కేసుల బీరు విక్రయించారు. కడప డిపో నుంచి రూ.27.13 కోట్ల విలువైన 37,665 కేసుల IML, 19,657 కేసుల బీరును విక్రయించారు.

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కడపకు చేరుకున్నారు. రేపు కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అలాగే పలు ప్రారంభోత్సవాలలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కడపకు చేరుకోగా కలెక్టర్ శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు నాయకులు స్వాగతం పలికారు.

కడప డివిజనల్ కార్యాలయంలో ఎల్ఐసీ బీమా వారోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఎల్ఐసీ దేశంలోనే బీమా రంగంలో 65.81 శాతం వాటాతో నంబర్ 1 స్థానంలో ఉందని, 99.98 శాతం డెత్ క్లెయిమ్లు చెల్లిస్తూ ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉందని తెలిపారు. 2025 జనవరి 20న ఒకే రోజు 5,88,107 పాలసీలు సేకరించి గిన్నిస్ రికార్డు సాధించడం ఎల్ఐసీ గర్వకారణమని పేర్కొన్నారు.

యూత్ ఫెస్ట్–2025 భాగంగా HIV/AIDS & STI అవగాహన కోసం కడపలో 5K రెడ్ రన్ మారథాన్ నిర్వహిస్తున్నామని డీఎంహెచ్వో నాగరాజు అన్నారు. కడపలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం 5.30 గంటలకు మహావీర్ సర్కిల్ నుంచి రిమ్స్ బ్రిడ్జీ వరకు, అక్కడి నుంచి తిరిగి మహావీర్ సర్కిల్ వరకు 5K రన్ ఉంటుందన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఉంటాయని స్పష్టం చేశారు.

జిల్లాలోని ART క్లినిక్స్, సరోగసీ సెంటర్లు తప్పనిసరిగా ART Act-2021, సరోగసి యాక్ట్-2021 నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. IVF, IUI, ICSI చికిత్సలు అర్హులైన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలన్నారు. రోగుల సమ్మతి తప్పనిసరి, గుడ్డు, వీర్యం, భ్రూణాల విక్రయం, వాణిజ్య సరోగసీ నిషేధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన క్లీనిక్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ అశోక్ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’(PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 113 మంది పిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామన్నారు.

మంత్రి నారా లోకేశ్ కమలాపురం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన పర్యటించనున్నారు. ఉదయం10.30 గంటలకు పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల భవనాలు ప్రారంభిస్తారు. 11.35కు కొప్పర్తిలో ఓ కంపెనీని ప్రారంభించి 12.20కి చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లెకు చేరుకుంటారు. సెంట్రల్ కిచెన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం 2గంటలకు చింతకొమ్మదిన్నె మండలం కొలుమలపల్లెలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.
Sorry, no posts matched your criteria.