India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ కడప ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు. స్వామిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు

వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ కడప ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు. స్వామిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు

కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎక్స్ వేదికగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కొంతమంది ప్రముఖులు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు పేరున రీ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.

కొండాపురంలోని లావునూరు రహదారిలో మంగళవారం రాత్రి బైకు – కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.

తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తన ఫొటోలు వాడి ఇతరులను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్ హ్యాకర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.

కడప జిల్లాలో జనరల్ కేటగిరిలో 27 బార్ల ఏర్పాటుకు అధికారులు ఈనెల 18న దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకు ఇవాళ్టితో ముగియగా ఈ నెల 29 వరకు పొడగించారు. ఈ రోజుకి 27కు గాను 7బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ప్రొద్దుటూరులో 4 బార్లకు, కడపలో 2 బార్లకు, బద్వేల్లో 1 బార్కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురంలో బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

కడప జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 29వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా ప్రాహిబిషన్ & ఎక్సైజ్ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2లో కలిపి మొత్తం 29 బార్ల ఏర్పాటుకు అధికారులు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.

వినాయక పండుగ సందర్భంగా కడప జిల్లా వాసులు DJ విషయంలో సందిగ్ధంలో పడ్డారు. DJలకు ఎటువంటి పర్మిషన్ లేదని ఇప్పటికే ఎస్పీ కార్యాలయం తెలిపింది. అయితే ఇవాళ కడప జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. DJలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని, నిబంధనలు ఎక్కువగా లేకుండా పర్మిషన్లు ఇవ్వాలన్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వినాయక మండపాల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు.
Sorry, no posts matched your criteria.