India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ను కలిసి సమస్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రైలుకు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజు రైలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందుల యురేనియం ఫ్యాక్టరీ సమస్యలను విన్నవించారు.
కొండాపురం మండలంలోని దత్తాపురం బస్టాప్ వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సు, ఐచర్ వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, గుజరాత్ నుంచి కడపకు వెళ్తున్న ఐచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తనని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక పీపీ, దస్తగిరికి హైకోర్టు నోటీసులు పంపింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది..
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆహారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నారు.
కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల నారాయణ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కొప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్తో మీరు కలిశారా?.
కడప జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారం మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న కడప జిల్లాలో గరిష్ఠంగా 34.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తగిన మోతాదులో నీరు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పులి అడుగులు కనిపించాయని వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు శనివారం రాత్రి పొలాల్లో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి పులి సంచరిస్తుందని చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అడుగులు పులివి కావని నిర్ధారించారు. ఈ తనిఖీల్లో సీఐ నరసింహులు, ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.