Y.S.R. Cuddapah

News October 8, 2025

బాణసంచా గోడౌన్లలో భద్రత తప్పనిసరి: కలెక్టర్

image

బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్‌లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ నచికేత్, డిఆర్వో గంగాధర్ గౌడ్‌లతో కలసి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్స్, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News October 7, 2025

మానవతా విలువలకు రామాయణం ప్రతీక: కడప ఎస్పీ

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రామాయణం ద్వారా ప్రతి ఒక్కరూ మానవతా విలువలు, ఉన్నతమైన ఆదర్శాలు ఆచరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవత విలువలతో పనిచేయాలని సూచించారు.

News October 7, 2025

కొండాపురంలో అత్యధిక వర్షం

image

కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.

News October 7, 2025

కడపలో యువతి ఆత్మహత్యాయత్నం

image

కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

News October 7, 2025

పులివెందులలో MP అవినాశ్ ప్రజా దర్బార్

image

కడప పార్లమెంట్ సభ్యుడు YS అవినాశ్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను ఎంపీకి తెలియజేశారు. ప్రజల ఆవేదనను ఆలకించిన అవినాశ్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వీరివెంట ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చినా నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

News October 6, 2025

జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్

image

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నిబంధనల అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఏవైనా భద్రత సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 5, 2025

తనిఖీలు చేపట్టిన కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ఘటన నేపథ్యంలో కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం లేబుళ్లను తనిఖీ చేశారు. మద్యం బాటిళ్ల మూతలను, సీళ్లను పరిశీలించారు. ప్రొద్దుటూరులోని మద్యం దుకాణాల్లో మద్యం లేబుళ్లను పరిశీలించినట్లు ఎక్సైజ్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో నకిలీ మద్యం లేదని జిల్లా ES రవికుమార్ స్పష్టం చేశారు.