Y.S.R. Cuddapah

News September 23, 2024

రాయచోటి: బండరాయి కిందపడి వ్యక్తి మృతి

image

రాయచోటి మండల పరిధిలోని గొర్లముదివేడుకు చెందిన గౌనిపల్లి మల్లయ్య(55) రాళ్లను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే గుట్ట వద్ద రాళ్లు కొడుతూ మట్టి తవ్వుతున్న క్రమంలో పెద్ద బండరాయి వచ్చి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News September 23, 2024

పులివెందుల: అమల్లోకి లాక్ హౌసింగ్ మానిటర్ సిస్టం

image

పోలీసువారు అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఉచిత సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో జరుగుతున్న దొంగతనాల నివారణకు ఎల్.హెచ్.ఎం.ఎస్ సిస్టమ్‌ను మీ ఇంటి నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు మొబైల్ యాప్ ద్వారా పోలీసులకు తెలపాలన్నారు.

News September 23, 2024

కడప హజ్ హౌస్‌ను త్వరగా పూర్తి చేయాలి: చంద్రబాబు

image

సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం పలు విషయాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా.. కడపలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌస్ నిర్మాణం గురించి అధికారులను అడిగారు. 80% పూర్తయిందని తెలుపగా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదివరకు ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

News September 23, 2024

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: SP

image

కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.

News September 23, 2024

పులివెందుల: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ

image

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

News September 23, 2024

Way2News: కడప జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

ఉమ్మడి కడప జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News September 23, 2024

పులివెందుల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

image

పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1984-85 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి గురువులను సత్కరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని అక్కడే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశానికి గుర్తుగా స్కూల్ ఆవరణంలో మొక్కలను నాటారు.

News September 23, 2024

కడప: ఫారెస్ట్ రేంజ్ అధికారులు బదిలీ

image

ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అధికారి చిరంజీవి చౌదరి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్‌లో పనిచేస్తున్న రమణారెడ్డిని కర్నూలుకు బదిలీ చేశారు. కడప నుంచి నయీమ్ అలీని బద్వేల్‌కి, పీలేరు నుంచి రామ్ల నాయక్, వెంకటరమణను తిరుపతికి, రాజంపేట నారాయణ పలమనేరుకు, రాజంపేట రఘు శంకర్‌ను తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 22, 2024

కడప: అతివేగానికి నిండు ప్రాణం బలి

image

కడప జిల్లా మాధవరం -1 పార్వతిపురం గంగమ్మ గుడి దగ్గర రోడ్డు దాటుతున్న నారాయణ సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే యువకుడు శనివారం రాత్రి బైక్‌పై వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను కడప రిమ్స్‌కు తరలించగా చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 22, 2024

ముద్దనూరు: సినీ ఫక్కిలో దొంగతనం

image

కడప- తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని బొందలకుంట గ్రామంలో శనివారం సినీ ఫక్కిలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొందకుంట రహదారిలో బైక్‌పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మంగపట్నం పుల్లయ్య, సుబ్బమ్మలను పోలీసులమని చెప్పి ఆపి.. వారి వద్ద ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న ముద్దనూరు సీఐ దస్తగిరి, SI మైనుద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.