India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవో 117 ఉపసంహరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందడమే కాకుండా.. వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేయనుందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జీవో 117 ఉపసంహరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సన్నాహక మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ, నివేదికల సమర్పణ తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ ఒప్పంద అధ్యాపకుడు తిరుపతిరావుపై విద్యార్థిని ఫిర్యాదు మేరకు స్థానిక ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడు తిరుపతిరావు రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.
☛ పేదరికంలో కడప జిల్లాకు 12వ స్థానం
☛ కడప: ప్రేమ పేరుతో మోసం
☛ మారనున్న గండికోట రూపురేఖలు
☛ బోల్తాపడ్డ జమ్మలమడుగు డిపో బస్సు
☛ కడపలో TDP కార్యకర్త ఆత్మహత్యాయత్నం
☛ మాకు ఇంకా రూ.350 కోట్లు కావాలి: ఎమ్మెల్యే ఆది
☛ చక్రాయపేట: మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
☛ చక్రాయపేట: భర్త కువైట్కు వెళ్తున్నాడని భార్య ఆత్మహత్య
కడప జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో గండికోట ఒకటి. ఇప్పటికే గండికోట అభివృద్దికి రూ.77.0 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. త్వరలో రూ.2500 కోట్ల వ్యయంతో ఇక్కడ 40 ఎకరాల్లో రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క అభివృద్ది పనులు, మరోవైపు ఈ రిసార్టులు పూర్తయినట్లయితే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో గండికోట పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోందని పలువురు అంటున్నారు.
సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. అత్యంత పేద జిల్లాల లిస్ట్లో YSR జిల్లా 12వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్కౌంట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.
పెండ్లిమర్రి మండలం గంగనపల్లి గ్రామం మాలవాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను కడతేర్చిన ఘటన గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సుబ్బరాయుడు తన భార్య లూర్థ్ మేరీని మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పెండ్లిమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు, TDP నాయకుడు పోతుగంటి పీరయ్య శనివారం మృతి చెందారు. ఆయన శుక్రవారం ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల TDP శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య మృతి చెందారన్న వార్త తనను ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని శనివారం Xలో తెలిపారు.
కడప జిల్లాలో పారిశ్రామిక, ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.
కడప జిల్లాలో పోలీసు శాఖలో సిబ్బంది సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు ఎస్పీ అశోక్ శుక్రవారం స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఉన్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి పరిష్కరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.