India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైల్వేకోడూరు- మైసూరు వారిపల్లి దగ్గర బైక్లో వస్తున్న వ్యక్తి లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుని పేరు కిరణ్ కుమార్ రెడ్డి(23) అని ఇతను కోడూరు నుంచి మాధవరంపోడుకు వళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.
రాయచోటి ప్రాంతీయ వైద్యశాల వైద్యులు కార్పొరేట్ వైద్యానికి తీసిపోని విధంగా అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ సివిల్ సర్జన్ డి లక్మీప్రసాద్ ఆధ్వర్యంలోని, వైద్య బృందం కడుపునొప్పితో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక నిరుపేద రోగి కడుపులోని 12 కణుతులను తొలగించి పేదరోగికి ప్రాణదానం చేశారు.
వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థిని జమీషా ఖురేషి (17)అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి క్యాంపస్లోని బ్రాత్ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొన్న సంఘటనను విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లాలో ఒంటెల వ్యాపారం కలకలం రేపుతోంది. సంబేపల్లె పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి ఒంటెలను తెచ్చి రాయచోటి, మదనపల్లె, పీలేరు, బెంగళూరు ప్రాంతాల్లో విక్రయిస్తూన్నట్లు తెలిసింది. రాయచోటి వద్ద గుట్టల్లో ఉంచిన 16 ఒంటెలను రక్షించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాయచోటికి చెందిన ఓ బడా వ్యాపారి ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేశామని SI రామకృష్ణ తెలిపారు.
సంబేపల్లె మండలంలో ఇటుకల బట్టీ నిర్వాహకుడు <<13787732>>రాజగోపాల్ ఆత్మహత్య<<>>కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రూ.15 లక్షలు అప్పు, ఆరోగ్య సమస్యలు ఉండటంతో మనస్తాపం చెంది మంగళవారం నాటు తుపాకీతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. తుపాకీ వినియోగంపై క్లూస్టీం పరిశీలిస్తోంది. రాజగోపాల్కు నాటు తుపాకీ ఎక్కడిది, ఎంత కాలంగా అతని వద్ద ఉందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీరాం తెలిపారు.
కడప- విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ మోహన్ దాస్ తెలిపారు . విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
సీఎం చంద్రబాబుతో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు భేటీ అయ్యారు. అమరావతిలో రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంతో వీరు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్తో ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లాలో గంజాయి విక్రయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీని ఆదేశించినట్లు సమాచారం.
కమలాపురంలో రైలు రోకో కోసం చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయ పల్లి మల్లికార్జున్ రెడ్డి, సలహాదారుడు సంబుటూరు ప్రసాద్ రెడ్డిపై నమోదైన కేసును మంగళవారం విజయవాడలోని వీఐపీ కోర్టు కొట్టివేసింది. 2022లో కమలాపురంలో అన్ని రైలు ఆపాలని అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. దీనిపై రైల్వే అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు ఎస్సీ హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విద్యార్థి సంఘం నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్కు వినతిపత్రం అందించారు. వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక విద్యార్థులను మాత్రమే చేర్పిస్తున్నారని జిల్లా అధ్యక్షులు నాగేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు ఎస్సీ హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విద్యార్థి సంఘం నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్కు వినతిపత్రం అందించారు. వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక విద్యార్థులను మాత్రమే చేర్పిస్తున్నారని జిల్లా అధ్యక్షులు నాగేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.