Y.S.R. Cuddapah

News January 11, 2025

గాలివీడు MPDOపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

గాలివీడు MPDOపై డిసెంబర్ 27న దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘MPDOపై దాడి జరిగినప్పుడు.. కన్నతండ్రిపై దాడి జరిగితే కన్న కొడకు ఎలా స్పందిస్తాడో అలానే నేను కూడా స్పందించా‘ అని తెలిపారు’. అందుకే విషయం తెలియగానే కడపకు వెళ్లి పరామర్శించినట్లు తెలిపారు.

News January 10, 2025

వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

image

వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 9 గంటలకు పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అభిషేక్ రెడ్డి వైఎస్ ప్రకాశ్ రెడ్డికి మనమడు.

News January 10, 2025

నేటి నుంచి సెలవులు: కడప డీఈవో

image

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని డీఈవో మీనాక్షి వెల్లడించారు. జనవరి 19 వరకు సెలవులు ఉంటాయని చెప్పారు. 20న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. మైనారిటీ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని DEO హెచ్చరించారు.

News January 9, 2025

కడప: హత్య కేసులో ఐదుగురికి శిక్ష

image

తొర్రివేములకు చెందిన కుమ్మరి గురు ప్రసాద్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురువారం కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. హతుడి భార్య ప్రమీలకు తీట్ల సురేశ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. వారి బంధానికి భర్త అడ్డంకిగా మారడంతో మరో ముగ్గురితో కలిసి ప్రసాద్‌ను హత్య చేశారు. కేసును విచారించిన 2nd ADJ కోర్ట్ జడ్జి G. S రమేశ్ కుమార్ వారికి జీవిత ఖైదు విధించారు.

News January 8, 2025

పుల్లంపేటలోని శ్రీ సంజీవరాయస్వామికి పొంగళ్లు

image

పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

News January 8, 2025

కడప జిల్లాలో నేడు ప్రధాని ప్రారంభించేవి ఇవే

image

ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ. 135 కోట్లతో మైదుకూరు – ముదిరెడ్డిపల్లె 2 లైన్ల రోడ్డు విస్తరణ, రూ. 1.321 కోట్లతో వేంపల్లి – చాగలమర్రి 2/4 వరుసల విస్తరణ పనులు చేపట్టనున్నారు. తమ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 8, 2025

కడప: 7వ రోజు పకడ్బందీగా కానిస్టేబుల్ దేహారుడ్య పరీక్షలు

image

ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహారుడ్య పరీక్షలను కడప జిల్లా కేంద్రంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్ర మైదానంలో జిల్లా ఇన్‌ఛార్జి విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో కట్టుదిట్టంగా నిర్వహించారు. 7వ రోజు దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 

News January 7, 2025

తొండూరులో తల్లీ, కూతురు దారుణ హత్య

image

పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి (37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోసి హతమార్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 7, 2025

కడప జిల్లా ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

కడప జిల్లాకు సమీపంలో ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కడప రిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని అన్నారు.

News January 7, 2025

కడప: కులగణన అభ్యంతరాలకు నేడే చివరి రోజు

image

కుల గణనకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అభ్యంతరాల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి తెలిపారు. కులగణన అభ్యంతరాలు ఇంకా ఉండిఉంటే, తగిన ఆధారాలతో సచివాలయాలకు వెళ్లాలన్నారు. కాగా దీనికి సంబంధించిన తుది జాబితాను జనవరి 17న సచివాలయాల్లో ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.