India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివాండ్ల పల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్ నాటు తుపాకీతో కాల్చుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ మృతి చెందాడు. ఇతను ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న రాజగోపాల్ మృతికి అప్పులే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోని నాటు తుపాకీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
ప్రొద్దుటూరు, కడప ఆదాయపు పన్ను శాఖ పరిధిలో రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఉద్యోగులు పన్ను చెల్లించాలి. కొందరు ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికొచ్చే వేతనం నుంచి గృహ నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేశారని గుర్తించి, ప్రొద్దుటూరు ఆదాయపు పన్ను డివిజన్ పరిధిలో గతేడాది 800 మందికి నోటీసులు ఇచ్చి వారినుంచి రూ.10 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు.
మైదుకూరు పట్టణంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కాజీపేట మండలం కొత్త పుల్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు, పనులు ముగించుకొని బైక్పై తన స్వగ్రామానికి వస్తుండగా మైదుకూరు సాయిబాబా గుడి వద్ద టాటా వ్యాన్ ఢీకొని గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను కడప ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ – 19 గ్రూప్ -బి జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ 91.1 ఓవర్లలో 347 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. జట్టులోని ఆర్. రోహిత్ 76, చేతన్ రెడ్డి 72, గురు చరన్ 70, ప్రణవ్ కుమార్ రెడ్డి 66 పరుగులు చేశారు. బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.
ఉమ్మడి కడప జిల్లాలో రాత్రికి అక్కడక్కడ తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ విపత్తు నివారణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారం రోజుల క్రితం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు విత్తనాలు విత్తిన రైతులకు సహకరిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
రాజధాని అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై సీఎం కలెక్టర్లకు సూచనలు చేశారు.
తెలుగుగంగ కాలువలో నేడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. అధికారుల వివరాల ప్రకారం.. నేటి మధ్యాహ్నానికి జిల్లా సరిహద్దు 98,260 కి.మీ వద్దకు నీరు చేరుతుందన్నారు. అయితే 2వ తేదీన వెలుగోడు జలాశయం నుంచి తెలుగు గంగకు నీరు విడుదల చేయగా.. కాలువ వెంట నీరు పరుగులు తీస్తోంది. 67వ KM వద్ద 2,700 క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. కాగా నేటి మధ్యాహ్నంలోగా కడప జిల్లాకు కృష్ణమ్మచేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.