India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎంపికైనట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పేర్కొన్నారు. జనవరి 10 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో నేషనల్ యంగ్ లీడర్ షిప్ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు.
కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.
కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు సోమవారం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తుల బృందాన్ని, మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.
YSR టెరిటోరియల్ విస్తీర్ణం 2,98,07,827 హెక్టార్లు. ఏపీలో అటవీ విస్తీర్ణం రీత్యా అతిపెద్ద అరణ్యాలు కడప జిల్లాలో ఉన్నట్లు 1882 మద్రాస్ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో అమెజాన్ అడవుల కంటే దట్టమైన అడవుల 1.శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం, 2.శ్రీపెనుశిల అభయారణ్యం, 3.నల్లమల అడవులు, 4.పాలకొండ రక్షిత అరణ్యం, 5.గంగన పల్లె రక్షిత అరణ్యం, 6.శేషాచలం వంటి రహస్య అడవులు ఈ జిల్లాలో ఎన్నో ఉన్నాయన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా సోమవారం కడప కలెక్టరేట్లో ఫిర్యాదులను సేకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామస్థాయి, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను, ఫిర్యాదుల రూపంలో తమకు నేరుగా అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
మండలంలోని పగడాలపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య గొర్రెల మందపై వీధి కుక్కలు ఆదివారం ఉదయం దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. దీంతో దాదాపు రూ.1 లక్ష నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి చంద్రయ్య వాపోయారు. ఎండా, వానను సైతం లెక్కచేయకుండా గొర్రెలను కాసి పెంచుకున్న పిల్లలను కుక్కలు పొట్టన పెట్టుకున్నాయని వాపోయారు. కష్టపడి పెంచుకుంటున్న గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందడంతో విలపించారు.
ఓ RMP అందించిన వైద్యానికి సుబ్బరాయుడు అనే వ్యక్తి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన కమలాపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ‘సుబ్బరాయుడు కాలికి గాయం కావడంతో కమలాపురం పట్టణం మార్కెట్లోని RMP వైద్యుని సంప్రదించారు. అతడు అందించిన చికిత్సలకు స్పృహ కోల్పోయాడు. రిమ్స్, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు అందించగా.. మెరుగైన చికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు’ అని వాపోయారు.
కడప జిల్లాలోని చారిత్రాత్మక గండికోట, సిద్దవటం కోటలలో సినీ చిత్ర పరిశ్రమ హీరోలు షూటింగ్ జరపాలని నిర్మాత దిల్ రాజును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని కోరుకుంటూ జిల్లాలోని సిద్దవటం, గండికోటలో సినిమాలు తీయాలన్నారు.
Sorry, no posts matched your criteria.