Y.S.R. Cuddapah

News February 20, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

image

తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

News February 20, 2025

వేముల: మహిళ హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

image

వేముల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలో ఈనెల 2వ తేదీన సింగంశెట్టి పద్మావతి అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ ఉసలయ్య, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముద్దాయితోపాటు బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచామన్నారు. బంగారం నగల కోసమే హత్య చేశారన్నారు.

News February 20, 2025

భూముల రిసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

image

జిల్లాలో భూముల రిసర్వే వేగవంతంగా, పకడ్బందీగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రిసర్వేపై సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. అనంతరం అదితి సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు.

News February 19, 2025

కడప జిల్లా TODAY టాప్ న్యూస్

image

➣ కడప: ‘ముస్లింలు అంటే సీఎంకు చిన్నచూపు’
➣ గోపవరం: గుండెపోటుతో 24 ఏళ్ల యువకుడు మృతి
➣ సిద్దవటం మండలంలో భారీ చోరీ
➣ 22న ప్రొద్దుటూరులో మినీ జాబ్ మేళా
➣ లింగాలలో పట్టుబడిన చీనీ కాయల దొంగలు
➣ కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
➣ కమలాపురం: నలుగురి పిల్లలతో తల్లి జీవన పోరాటం
➣ గండికోటలో సెల్ఫీ తీసుకున్న కలెక్టర్, MLA
➣ జగన్‌పై జమ్మలమడుగు MLA ఫైర్

News February 19, 2025

కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

కడప జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

News February 19, 2025

కడప: ‘ప్రాజెక్టులను విస్మరిస్తే ఉద్యమమే’

image

నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం తప్పదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు ఉద్యమ కార్యాచరణకు వేదిక కానుందని తెలిపారు. కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News February 18, 2025

కడప: YVU వీసీగా ప్రకాశ్ బాబు

image

యోగి వేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రకాశ్ బాబును ఉన్నతాధికారులు నియమించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్‌ఛార్జ్ వైస్ చాన్సలర్లతో పరిపాలన కొనసాగిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీ నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ వీసీగా కొనసాగనున్నారు.

News February 18, 2025

కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర 

image

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు