Y.S.R. Cuddapah

News February 8, 2026

ప్రొద్దుటూరులో ACP సస్పెండ్‌తో నైనా.. అధికారుల అవినీతి తగ్గేనా?

image

ప్రొద్దుటూరు ACP నాగరాజు సస్పెండ్‌తో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి అవినీతి మయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు ప్రతి నిర్మాణానికి అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారట. మామూళ్ల వసూలు కోసం ఏజెంట్లను సైతం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని, TPO, ACP వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News February 8, 2026

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ కోసం CMకు వినతి

image

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును శనివారం విజయవాడలో కలిసి విన్నవించినట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. గాండ్ల సంఘం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, నూనె తయారీ యూనిట్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

News February 8, 2026

కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

image

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.

News February 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 7, 2026

పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి..!

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు.

News February 7, 2026

నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

image

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

News February 7, 2026

దేవుని కడపకు పోటెత్తిన భక్తులు

image

తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున నుంచి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

News February 7, 2026

కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.

News February 7, 2026

కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.

News February 7, 2026

కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.