Y.S.R. Cuddapah

News December 25, 2024

అన్నా వదినల ముచ్చటైన జంట: చింతా ప్రదీప్‌రెడ్డి

image

YS జగన్ మంగళవారం 4 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన ఎస్టేట్‌లో బంధువులతో కలిసి జగన్ ఫొటోలు దిగారు. అనంతరం జగన్, భారతి జంటగా ఓ ఫొటో దిగగా.. ‘అన్నా వదినలది చూడమచ్చటైన జంట’ అంటూ ముద్దనూరు చెందిన YCP యూకే కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్‌రెడ్డి ట్వీట్ చేశారు. పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు.

News December 25, 2024

రాజంపేట YCP నేత సుబ్బారెడ్డి అరెస్ట్

image

రాజంపేట మండలం గుండ్లూరు వద్ద ఒంటిమిట్ట మండలానికి చెందిన బ్రహ్మయ్యపై దాడి కేసులో నందలూరు జడ్పీటీసీ గడికోట ఉషారాణి భర్త YCP నేత సుబ్బారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన వర్గీయులతో కలిసి బ్రహ్మయ్యను కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుబ్బారెడ్డితోపాటు మరో 6మందిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News December 25, 2024

ఒంటిమిట్ట విమాన గోపుర నిర్మాణానికి ఆమోదం

image

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో విమాన గోపురంలో బంగారు కలశం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు కలశం నిర్మాణానికి సంబంధించి 43 లక్షల రూపాయలతో చేపట్టడానికి పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

News December 24, 2024

కుటుంబంతో సరదాగా వైఎస్ జగన్

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు రోజులు జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కుటుంబంతో ఇడుపులపాయ నందు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ పెదనాన్న, చిన్నాన్న కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫొటోలో జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ భారతి, యువరాజ్, జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ఉన్నారు.

News December 24, 2024

వేముల: బాత్రూంలో జారి కిందపడి VOA మృతి

image

కడప జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామంలో వివోఏగా పనిచేస్తున్న సాయి లక్ష్మీ సోమవారం ఉదయం మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. వీవోఏ సాయిలక్ష్మి సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సబ్యులు గమనించి తీవ్రంగా గాయపడిన సాయిలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

News December 24, 2024

కడప: సంక్రాంతికి 294 ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతిని పురస్కరించుకుని ఉమ్మడి కడప జిల్లాలోని 6 RTC డిపోల పరిధిలో 294 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. జనవరి 9 నుంచి13 వరకు సాధారణ చార్జీలతో ఈ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఆర్టీసీ RM గోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి 111, బెంగళూరు నుంచి 81, విజయవాడ నుంచి 30, చెన్నై నుంచి 12, ఇతర ప్రాంతాల నుంచి 60కలిపి మొత్తంగా 294 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు.

News December 23, 2024

రేపు అన్నమయ్య జిల్లాలో స్కూళ్లకు ఐచ్ఛిక సెలవు

image

క్రిస్మస్ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో డిసెంబర్ 24 మంగళవారం ఐచ్ఛిక సెలవుగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు ఈ సందేశాన్ని ఆయన పంపారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ సెలవు ఇస్తున్నామని తెలిపారు.

News December 23, 2024

కడప: ఎవరో ఒకరు తగ్గండి..!

image

కడప కార్పొరేషన్ గత సర్వసభ్య సమావేశంలో మేయర్ సురేశ్ పక్కన తనకు కుర్చీ వేయలేదని MLA మాధవి రెడ్డి ఆందోళనకు దిగడంతో సభ జరగలేదు. ఇవాళ్టి సమావేశంలోనూ ఆమెకు కుర్చీ లేకపోవడంతో మేయర్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. గతంలో ఇదే మేయర్ MLAకు కుర్చీ వేసి ఇప్పుడే నిరాకరించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరూ పంతానికి వెళ్తే తమ సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని కడప ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 23, 2024

ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్

image

ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్ రానున్నారు. అనంతరం జిల్లాలో 4 రోజులపాటు పర్యటించనున్నారు. 24వ తేదీన ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 25న పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 27న తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.

News December 23, 2024

వాళ్లను జగన్ మోసం చేశారు: నిమ్మల

image

కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గండికోట జలాశయం పరిశీలన తర్వాత ఆయన మాట్లాడారు. ‘గండికోట నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని జగన్ చెప్పారు. కానీ ఐదేళ్లలో ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు మేము వాళ్లకు రూ.450 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. హంద్రీనీవాకు రూ.2500 కోట్లు కేటాయించాం. త్వరలో పనులు పూర్తి చేస్తాం’ అని నిమ్మల అన్నారు.