Y.S.R. Cuddapah

News November 5, 2024

9న కడప జిల్లాకు CM చంద్రబాబు

image

ఈనెల 9వ తేదీన కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు రానున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచాక మొదటిసారి జిల్లాకు రానుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

News November 5, 2024

రాజకీయ వేడి పుట్టిస్తున్న రాచమల్లు ప్రెస్‌‌మీట్లు

image

మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇటీవల ఆయన వరుస ప్రెస్‌మీట్లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల, విజయమ్మలపై కూడా ప్రశ్నలు సంధించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్.

News November 5, 2024

కడప శివాలయంలో MLA మాధవి పూజలు

image

కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కడప MLA మాధవి శివున్ని దర్శించుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో వెలిసిన శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా తోటి భక్తులతో కలిసి సామాన్యురాలిగా కార్తీక దీపాలను వెలిగించి ఆమె మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు.

News November 4, 2024

ఆర్మీ ర్యాలీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

image

ఈ నెల 10వ తేదీ నుంచి కడపలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మనోజ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి కడప కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చేసి అభ్యర్థులకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. రైన్ ప్రూఫ్ టెంట్స్, రన్నింగ్, ఇతర పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 4, 2024

కడప: ‘అర్జీదారులు సంతృప్తి పడేలా చూడాలి’

image

కడప జిల్లాలోని సుదూర ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, కాబట్టి వారు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ పరిష్కరించాలన్నారు.

News November 4, 2024

హైదరాబాద్‌లో బద్వేల్ వాసి మృతి

image

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై జరిగిన యాక్సిడెంట్‌లో బద్వేల్‌కు చెందిన బ్రహ్మయ్య(45) మృతిచెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బైకుపై రాంగ్ రూట్లో వచ్చిన బ్రహ్మయ్యను నియంత్రణ తప్పిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ బ్రహ్మయ్య మృతిచెందాడు. వనస్థలిపురం వాసి విజయ్ కుమార్ కారులో ఐమాక్స్ నుంచి వెళ్తుండగా.. టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. కేసు నమోదైంది.

News November 4, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ అదితి సింగ్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 9.30గం. నుంచి 10.30 గం. వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు 08562-244437 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పాలని తెలిపారు. అయితే నూతన కలెక్టర్‌గా శ్రీధర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

News November 3, 2024

కడప జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీధర్

image

కడప జిల్లా నూతన కలెక్టర్‌గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కలెక్టర్ శివశంకర్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన కలెక్టర్‌గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

News November 3, 2024

సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సంబేపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనం ఢీకొని చెన్నకేశవ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చిపోయిన వ్యక్తి బద్వేల్ పెద్ద గోపవరం గ్రామానికి చెందిన కోడూరు చెన్నకేశవగా గుర్తించారు. తన వ్యక్తిగత పనుల మీద అన్నమయ్య జిల్లా పీలేరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 3, 2024

కడప జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

image

కడప జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. వారం రోజుల్లో 284 బెల్ట్ షాపులను గుర్తించి దాడులు చేసి 371.1 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. 119 మంది అరెస్ట్ చేసి, 115 కేసుల నమోదు చేశామన్నారు. మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ 213 మంది పాత నేరస్థులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.