news

News March 12, 2025

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 26వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుంది. తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చారు.

News March 12, 2025

సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

TG: 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 నుంచి 21 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు, బరువు, ఛాతి, జీతం తదితర వివరాల కోసం పూర్తి <>నోటిఫికేషన్‌ను <<>>చూడండి.

News March 12, 2025

త్రిభాషా విధానం సరైనదే: సుధామూర్తి

image

విద్యార్థులు ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల అధిక ప్రయోజనం పొందుతారని ఎంపీ సుధామూర్తి అన్నారు. తనకు వ్యక్తిగతంగా 8 భాషలు వచ్చని నేర్చుకోవటమంటే ఎంతో ఇష్టమన్నారు. త్రిభాషా విధానం సరైనదే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ చిదంబరం హిందీని విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని కేంద్రం విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. NEPపై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

News March 12, 2025

APPLY NOW.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

AP: 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ <>నోటిఫికేషన్<<>> విడుదల చేసింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, YSR, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు(17.5-21 ఏళ్లు) APR 10లోగా దరఖాస్తులు సమర్పించాలి. జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్ టెక్నికల్, వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేయవచ్చు.

News March 12, 2025

బాబూ.. నీకిదే తొలి హెచ్చరిక: జగన్

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘యువత పోరు’ను పోలీసుల ద్వారా అణగదొక్కడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి చంద్రబాబుకు ఇదే తొలి హెచ్చరిక అన్నారు. ‘విద్యార్థుల కోసం మా ప్రభుత్వం విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు తన పాలనతో మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

News March 12, 2025

BIG BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

HYDకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) USలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఆయన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో HYD రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో AUSపై తొలి టెస్ట్ ఆడారు.

News March 12, 2025

త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

image

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News March 12, 2025

దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

image

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2025

మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

image

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.

News March 12, 2025

తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: సీఎం

image

AP: ‘తల్లికి వందనం’ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.