India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ఫైనల్ కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.115+ కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం చందూ మొండేటి దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ నివాస సముదాయంలో జితేంద్ర రావత్ అనే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చాణక్యపురిలోని రెసిడిన్షియల్ కాంప్లెక్స్లో ప్రభుత్వం కేటాయించిన భవనంలో ఆయన ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు భవనం పైనుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్తో బాధపడుతున్నట్లు సమాచారం.

మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారిత ?’ అని ప్రశ్నించారు.

అన్ని ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకు బీసీసీఐ గ్రేడ్ A+ కాంట్రాక్ట్ ఇస్తుంది. విరాట్, రోహిత్, జడేజా ఆ గ్రేడ్లోనే ఉన్నారు. కానీ వీరు T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గ్రేడ్ పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక BCCI దీనిపై ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం. ఇక గత ఏడాది కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్కు ఈసారి అవకాశం దక్కొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.

AP: రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 62 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ పెంచి చెల్లించాలని నిర్ణయించింది. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో CM చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.

మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండటంతో భారత్వైపు స్నేహ హస్తం చాచింది. సహకరించుకుందాం రమ్మంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. ‘ఒకరికొకరు అండగా రెండు దేశాలూ అభివృద్ధి చెందాలి. అదే ఉమ్మడి లక్ష్యం కావాలి. పోరాడుతూ కూర్చోవడం కంటే సహకారం అందించుకోవడం మేలు’ అని ఆయన పేర్కొన్నారు.

ఎల్లుండి NZతో జరిగే CT ఫైనల్లో IND జట్టులో ఒక మార్పు జరిగే ఛాన్సుంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో సుందర్ను జట్టులోకి తీసుకుంటారని సమాచారం. NZలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉండటంతో రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ను ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుందర్ ఆడితే బ్యాటింగ్ బలం కూడా పెరగనుంది. అటు NZలో యంగ్ స్థానంలో కాన్వే ఆడొచ్చు.

AP: డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ‘DSC నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా కేసులయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతూ వస్తున్నాం. అయితే, అభివృద్ధితో పాటు దేశంపై అప్పు కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాపై రూ.181 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు బడ్జెట్లో కేంద్రం తెలిపింది. ఇది వచ్చే ఏడాది వరకు రూ.196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కాగా, తెలంగాణపై రూ.5లక్షల కోట్లు, ఏపీపై రూ.9 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త సినిమా రాగానే టికెట్ ధరలు అమాంతం పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక కొత్త బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం అన్ని నేషనల్, స్టేట్ మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేసింది. దీంతో ఏ థియేటర్లోనైనా రూ.200 కంటే ఎక్కువ టికెట్ ధర ఉండకూడదు. దీనిపై సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సినీ ఇండస్ట్రీ మాత్రం తప్పుబడుతోంది. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.