news

News March 6, 2025

ఒకే వేదికపై దగ్గుబాటి, చంద్రబాబు

image

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపై కనిపించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి సతీమణి, ఎంపీ పురందీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

News March 6, 2025

FLASH: RGVకి హైకోర్టులో ఊరట

image

AP: డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై FIR నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News March 6, 2025

తిరుమల అన్నప్రసాదంలో వడలు

image

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.

News March 6, 2025

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగివ్వాలి: జైశంకర్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌కు ఇస్తేనే అక్కడి సమస్య పరిష్కారమవుతుందని కేంద్రమంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. లండన్‌లోని ఛాఠమ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్‌ పాలన సాగుతోందని, భారత్‌కు అది సరిగ్గా సరిపోతుందని తెలిపారు.

News March 6, 2025

ఈ పరంపరని బ్రేక్ చేయాల్సిందే.. ఏమంటారు?

image

CT ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో IND తలపడనుంది. గ్రూప్ స్టేజీలోనే NZని ఇండియా చిత్తు చేసిందని, ఫైనల్‌లో గెలుపు మనదేనని కొందరు IND ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన కొన్ని టోర్నీలను మరికొందరు గుర్తుచేస్తున్నారు. 2017 CTలో గ్రూప్ స్టేజీలో పాక్‌ను ఓడించినా ఫైనల్‌లో అదే టీమ్‌పై ఇండియా ఓడిపోయింది. 2023 ODI WCలోనూ ఇలాగే AUS ఫైనల్స్‌‌లో మనల్ని ఓడించింది. ఈసారి ఇది బ్రేక్ కానుందా?

News March 6, 2025

రంగన్న మృతిపై భార్య అనుమానం.. పోలీసుల దర్యాప్తు

image

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

News March 6, 2025

‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

image

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

News March 6, 2025

‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

image

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 6, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

రెండు రోజులుగా దాదాపు రూ.1360 పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గి సామాన్యుడికి ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది.

News March 6, 2025

NPS వాత్సల్య’తో పిల్లలకు మంచి భవిష్యత్తు: PFRDA ఛైర్‌పర్సన్

image

NPS వాత్సల్య పథకంలో ఇప్పటివరకూ లక్షమంది చేరినట్లు PFRDA ఛైర్‌పర్సన్ దీపక్ మహంతి వెల్లడించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే లక్షమంది చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులను ఇందులో చేర్చవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఇది మంచి స్కీం అని తెలిపారు. ఈ పథకాన్నికేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 18సంవత్సరాల లోపు పిల్లలు ఇందులో చేరడానికి అర్హులు.