India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.

✒ అనోరా- జీ5, జియో హాట్ స్టార్(మార్చి 17 నుంచి)
✒ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- నెట్ఫ్లిక్స్
✒ డ్యూన్:2 జియో హాట్స్టార్
✒ ది సబ్స్టాన్స్- అమెజాన్ ప్రైమ్(రెంట్), MUBI
✒ ది బ్రూటలిస్ట్- యాపిల్ టీవీ(రెంట్)
✒ ఎమిలియా పెరెజ్- MUBI, ప్రైమ్(రెంట్)
✒ విక్డ్- ప్రైమ్(రెంట్), హాట్స్టార్(మార్చి 22 నుంచి)

AP: శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. చీఫ్ విప్లు, విప్లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న సభలో ప్రకటించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో నిర్వహించే పోటీలకు IASలు, హైకోర్టు జడ్జిలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తండేల్’. ఈ చిత్రం ఈనెల 7న ఓటీటీలో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ సినిమాపై నిర్మాత బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘తండేల్ పైరసీకి గురైందని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పరోక్షంగా సినిమాను దెబ్బతీసింది. దానివల్లే పైరసీ అయిందని అందరికీ తెలిసింది. థియేటర్లో విజయవంతంగా నడుస్తున్నప్పుడు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది’ అని తెలిపారు.

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.

మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ చీఫ్ అబూ అజ్మీపై బీజేపీ నేత నవనీత్ కౌర్ ధ్వజమెత్తారు. శివాజీ మహారాజ్ రాష్ట్రంలో ఔరంగజేబ్ను పొగటటం ఏంటని ప్రశ్నించారు. ఔరంగజేబ్ సమాధిని రాష్ట్రం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్నికోరారు. ఆయనను ఇష్టపడే వారింట్లో ఏర్పాటు చేసుకోమన్నారు. అతని దాష్ఠీకాలు తెలియాలంటే ఛావా సినిమా చూడాలని సూచించారు. మెుగల్ రాజు మందిరాలు నిర్మించాడని, ఆయన పరిపాలన బాగుండేదని అబూ అజ్మీ అన్నారు.

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.