India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో <
* మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది.
పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8-12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3గంటల వరకూ పెరగనుంది.
పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8-12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3గంటల వరకూ పెరగనుంది.
బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న అఖండ-2 షూటింగ్ త్వరలో జార్జియాలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. జార్జియా షెడ్యూల్లో బాలయ్యతోపాటు ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా అనివార్య కారణాలతో సంక్రాంతికి వాయిదా పడినట్లు సమాచారం.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాబలగాల ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్రనేతృత్వమంతా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. అటు మానవహక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి నేటితో వందేళ్లు. ఎన్నో పోరాటాల కారణంగా 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో ఇది ఏర్పాటైంది. 1930లో దీన్ని విశాఖకు తరలించారు. 450 ఎకరాల్లో కొనసాగుతోన్న వర్సిటీలో 59 దేశాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు సహా దాదాపు 20వేల మంది(అనుబంధ కాలేజీలతో కలిపి) విద్యనభ్యసిస్తున్నారు. సీవీ రామన్, సీఆర్ రావు, వెంకయ్య, చలమేశ్వర్, గ్రంథి మల్లికార్జునరావు తదితరులు ఇక్కడే చదివారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల నికర విలువకు చేరుకున్న కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. కంపెనీ వార్షిక లాభాలు రూ.69,646 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో రూ.19,407కోట్ల ఆదాయాన్ని కంపెనీ గడించింది. సంస్థ అప్పులు రూ.3.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. జియో ప్లాట్ఫామ్స్ లాభం మార్చి త్రైమాసికంలో 25.7% వృద్ధితో రూ7,022 కోట్లకు పెరిగింది.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం(D) ఎచ్చెర్ల(M) బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయంగా 1,29,178 మంది అకౌంట్లలో రూ.20,000 చొప్పున జమ చేస్తారు. అంతకుముందు ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
TG: విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు.15 నుంచి 20రోజుల వరకూ నిర్వహించే ఈ క్యాంపుల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు శిబిరాలలో నేర్పించే అంశాలను నిర్ణయించారు. ఇది వరకూ హైదరాబాద్తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉన్న ఈ సమ్మర్ క్యాంపులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
వరుస ఓటములతో ఢీలా పడిన KKR ఇవాళ పంజాబ్తో తలపడనుంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా రా.7.30కు మ్యాచ్ మొదలవనుంది. కోల్కతాతో ఇటీవల జరిగిన మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని PBKS పైచేయి సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని రహానే సేన, జోరు కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో PBKS 5, KKR 7వ స్థానంలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.