news

News September 8, 2025

‘సృష్టి’ కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.

News September 8, 2025

భారత్ పొరుగు దేశాల్లో గొడవలు.. ప్రభుత్వాల మార్పు

image

2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్‌లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా

News September 8, 2025

ఒకే ఫ్రేమ్‌లో పవర్, ఐకాన్, గ్లోబల్ స్టార్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. అల్లు అరవింద్ అమ్మ కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులూ హాజరయ్యారు. ఈ ఫొటోలను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. కనకరత్నం ఆశీస్సులు తమపై ఉంటాయని పేర్కొంది. కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News September 8, 2025

నేపాల్‌లో హింస.. హోంమంత్రి రాజీనామా

image

నేపాల్‌లో <<17651342>>హింసాత్మక ఘటనలు<<>> జరుగుతుండటంతో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత ఇవాళ ఆందోళనకు దిగింది. పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి.

News September 8, 2025

తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలయ్య

image

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఇవాళ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రతినిధులతో ముంబై వెళ్లానని, అందులో భాగంగా NSEని సందర్శించానని పేర్కొన్నారు. NSE అధికారులు తన పట్ల చూపిన ఆత్మీయత, గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించి బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని వివరించారు.

News September 8, 2025

రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: సెప్టెంబర్ నెలకు సంబంధించి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కాకినాడ పోర్ట్ నుంచి 17,294, మంగళూరు పోర్ట్ నుంచి 5,400, జైగర్ పోర్ట్ నుంచి 10,800, విశాఖ పోర్ట్ నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. రైతులు ధైర్యంగా ఉండాలి’ అని సూచించారు.

News September 8, 2025

శ్రీదేవి తన గదికి రానిచ్చేది కాదు: బోనీ కపూర్

image

‘మామ్’ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి తన గదికి అస్సలు రానిచ్చేది కాదని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. ఆ పాత్ర పట్ల ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ‘ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. రెమ్యునరేషన్ ఎక్కువ అని వద్దనుకున్నాం. కానీ శ్రీదేవి తన పారితోషికం రూ.70 లక్షలు ఇచ్చి ఆయనను తీసుకురావాలని చెప్పారు’ అని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

News September 8, 2025

YCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: అయ్యన్న

image

AP: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూరియాపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరియాపైనే కాదు మిగతా అన్ని సమస్యలపైనా చర్చిద్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.

News September 8, 2025

లక్ష మందికి ఉచితంగా కంటి ఆపరేషన్

image

వైద్యం వ్యాపారపరమైన ఈ రోజుల్లో ఓ వైద్యుడు లక్షలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి దైవంగా మారారు. నేపాల్‌కి చెందిన డా.సందుక్ రూయిట్ తన జీవితాన్ని పేదవారికి చూపును ప్రసాదించేందుకు అంకితం చేశారు. హిమాలయ పర్వతాల్లోని మారుమూల గ్రామాల నుంచి ఆసియా, ఆఫ్రికా అంతటా ఆయన సేవలు విస్తరించాయి. ఆయన ప్రారంభించిన ‘హిమాలయన్ క్యాటరాక్ట్ ప్రాజెక్ట్’ 14లక్షలకు పైగా రోగులకు చికిత్స చేసింది.

News September 8, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు ఎప్పుడంటే?

image

రైల్వేలో 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి <<15529908>>RRB<<>> నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక <>వెబ్‌సైట్‌ను<<>> ఫాలో కావాలని సూచించింది.