India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్ను SIT సాక్షిగా విచారించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రిలేషన్, తన ఇంట్లో పూజలపై ప్రధానంగా ప్రశ్నించారు. తరచూ శబరికి వెళ్లే తనకు అక్కడి ఉద్యోగి పొట్టి పరిచయం ఉందని జయరామ్ గతంలో తెలిపారు. దేవాలయం మూసి ఉండే రోజుల్లో ఆభరణాలు ఇంట్లో ఉంచి పూజిస్తే మంచిదని తనతో చెప్పాడన్నారు. గతంలో జయరామ్ ఇంట్లో ఆభరణాలతో పూజలు చేసిన ఫొటోలు కలకలం సృష్టించాయి.

AP: అక్రమ మద్యం కేసులో అరెస్టై నిన్న బెయిల్పై జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YCP అధినేత జగన్ను కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి వెళ్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వివరించినట్లు YCP ట్వీట్ చేసింది. కాగా ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చినట్లు పేర్కొంది.

TG: మున్పి‘పోల్స్’లో పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRలకు వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలలోని రెబల్స్పై పార్టీ ఇన్ఛార్జ్లతో వారు మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్లు ముగిశాక వారిని ఉపసంహరింప చేసేలా చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు FEB3.

<

ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వంట చేసినా ఆహారపదార్థాలు మాడిపోయి వాసన వస్తుంటాయి. కొన్ని చిట్కాలతో మాడు వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు. *బిర్యానీ, పలావ్ అండుగంటితే ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కోసి వండిన గిన్నెలోని మూలల్లో ఉంచాలి. పావుగంట తర్వాత ఆ ముక్కలు తీసేస్తే మాడు వాసన చాలా వరకు తగ్గుతుంది. *మాడిపోయిన కూరలు, ఇతర ఆహార పదార్థాలపై దాల్చినచెక్క పొడిని చల్లితే వాసనపోయి మంచి రుచి వస్తుంది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవని BRS తరఫు లాయర్ మోహిత్ రావు తెలిపారు. CRPC 160 ప్రకారం నోటీసులు ఇవ్వలేరని, గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. 65 ఏళ్లు దాటినవారిని ఇంటి వద్దే విచారించాలని పేర్కొన్నారు. ఇక రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మోహిత్ రావు స్పష్టం చేశారు.

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్స్టార్ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు AI కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. OpenAI వంటి వాటితో పోటీ పడలేకపోతుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఇంట్రాడేలో ఆ కంపెనీ షేర్లు 12% లాస్ అయింది. మైక్రోసాఫ్ట్కు 2020 తర్వాత ఇదే వరస్ట్ డే. ఫలితంగా కంపెనీ సుమారు $400 బిలియన్ల సంపద కోల్పోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద నష్టం కాగా గత JANలో Nvidia $593 బిలియన్లు కోల్పోయింది.

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి.. భర్త, సంబంధం చూసిన మామ(వరుసకు) ఆత్మహత్యకు కారణమైంది. KAలోని గుమ్మనూరుకు చెందిన హరీశ్, సరస్వతికి 2నెలల క్రితం వివాహమైంది. ఆమె ప్రియుడు శివతో ఇటీవల వెళ్లిపోయింది. అవమానంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నాడు. అది తెలిసి సంబంధం చూసిన రుద్రేశ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరస్వతి లవ్ గురించి ముందే తెలిసిన హరీశ్ ఆమె పేరెంట్స్ను ఒప్పించి పెళ్లి చేసుకోవడం కొసమెరుపు.
Sorry, no posts matched your criteria.