news

News December 23, 2024

మోదీకి అంతర్జాతీయ పురస్కారాలు@20

image

ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ రాజు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను అందజేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 20కి చేరింది. ఆయనకు గతంలో బార్బడోస్, గయానా, డొమినికా, నైజీరియా, రష్యా, భూటాన్, ఫ్రాన్స్, US, UAE తదితర దేశాలు పురస్కారాలను అందించాయి.

News December 23, 2024

మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా?: ట్రంప్ ఆన్సర్ ఇదే

image

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించనున్న స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారా? అన్న ప్రశ్నకు ‘అది సాధ్యం కాదు. నేను సేఫ్. ఎందుకంటే మస్క్ USలో జన్మించలేదు’ అని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ పుట్టినవారికే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కాగా మస్క్ సౌతాఫ్రికాలో జన్మించారు.

News December 23, 2024

శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

News December 23, 2024

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు: మంత్రి

image

TG: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన <<14952214>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.

News December 23, 2024

పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి

image

TG: దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రత్యేక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధినిచ్చింది. 24/7 పనిచేసే ఈ పంపులో రోజుకు ₹లక్ష విలువైన ఇంధనం సేల్ అవుతోంది. దేశంలో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల కోసం పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

News December 23, 2024

శ్రీతేజ్‌ కోసం రూ.2 కోట్లతో అల్లు అర్జున్ ట్రస్టు?

image

TG: సంధ్య థియేటర్‌ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్‌ కోసం అల్లు అర్జున్‌ ఓ ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బన్నీ, సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ కలిసి దాదాపు రూ.2 కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News December 23, 2024

బన్నీ బెయిల్ రద్దు కోసం నేడు పిటిషన్?

image

TG: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఈ కేసులో అరెస్టైన బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 23, 2024

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

image

అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/తత్సమాన విద్య పూర్తిచేసిన వారు అర్హులు. జనవరి 7 నుంచి FEB 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సైట్: <>https://agnipathvayu.cdac.in/<<>>

News December 23, 2024

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.

News December 23, 2024

పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే

image

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్‌ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.