India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్తో T20 సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. T20 సిరీస్ జట్టు: బట్లర్(C), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్ను ఎంపిక చేసింది.
వెస్టిండీస్పై T20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ చేసింది. ఫామ్లో ఉన్న స్మృతి మంధాన 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నారు. హర్లీన్(44), ప్రతీక(40), హర్మన్ ప్రీత్(34) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5, మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. WI టార్గెట్ 315.
తనపై <<14941111>>నమోదైన కేసుపై<<>> మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. తాను పెట్టుబడి పెట్టాననే కారణంతోనే సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్ పదవి తనకు ఇచ్చారని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ సంస్థలో యాక్టివ్గా లేనని తెలిపారు. కొన్నేళ్ల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ నిధుల అవకతవకల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
TG: పబ్లిక్తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
AP: అధికారంలోకి వచ్చిన తర్వాత CM చంద్రబాబు హామీలను గాలికొదిలేశారని YCP నేతలు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ నెల 27న YCP పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోయలేక ప్రజలు అల్లాడుతున్నారు. SC, STలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు మంగళం పలికారు. ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం’ అని వారు మండిపడ్డారు.
తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని కోరారు. కాగా, బన్నీ అరెస్టు తర్వాత సీఎంపై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.
AP: CM చంద్రబాబు తన భద్రతను కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని CM నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్కు సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్లో నటించేందుకు తొలుత ఇబ్బంది పడ్డానని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ‘పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే పీలింగ్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాం. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే నాకు భయం. అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని డాన్స్ చేశారు. ముందు కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. కానీ డైరెక్టర్ చెప్పినట్లు చేసేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.