India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సాధారణంగా ఏ కోడికైనా ఈకలు ఉండటం సహజం. అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని నాటు కోడి ఆశ్చర్యపరుస్తోంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందని, దీని వయసు 6 నెలలని యజమాని ఇస్మాయిల్ చెప్పారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదైన లక్షణాలు కోళ్లలో ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.

TG: రాత్రికి రాత్రే హైదరాబాద్ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

TG: వ్యవసాయ భూముల పేరుతో అనధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ప్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు. అయితే కొందరు ఫామ్ ల్యాండ్ను ప్లాట్లుగా మార్చుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇళ్లు కడితే కూల్చేస్తామని స్పష్టం చేశారు.

AP: పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. SI(సివిల్) పోస్టులను 65%(గతంలో 55%) డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది.

TGలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా APలో ఎదురుచూపులు తప్పడం లేదు. గత జులై, ఆగస్టులోనే మంజూరు చేస్తామని కూటమి ప్రకటించినా ఇప్పటికీ పురోగతి లేదు. కొత్త కార్డులు, మార్పులు చేర్పులకు YCP హయాంలోనే 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అవకాశం కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. త్వరగా ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
* ఈ అంశంపై మీ కామెంట్

AP: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులివ్వనుంది. దీంతో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు ఇస్తున్న ₹లక్ష మొత్తం సగటున ₹1.55 లక్షలకు పెరగనుంది. సర్వీసును బట్టి కొందరికి ₹2-2.5L అందనుంది. ఆయాలకు ఇచ్చే ₹40K సగటున ₹65-75Kకు చేరనుంది.

పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయంలో రూ.3,12,522తో TG దేశంలోనే టాప్లో ఉందని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్(2023-24) నివేదిక తెలిపింది. 1.5కోట్ల మంది ఉపాధి పొందుతుండగా 51% మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో, 12% తయారీ రంగంలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో IT, రియల్ ఎస్టేట్, సేవల రంగాలు 24.4శాతంతో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది. జిల్లాల వారీగా రూ.9.54 లక్షలతో RR టాప్లో ఉంది.

అసాంక్రమిక వ్యాధులను(NCD) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఎల్లుండి నుంచి మార్చి 31 వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఉచితంగా NCD టెస్టులు చేయాలని ఆదేశించింది. 30 ఏళ్లు పైబడిన వారందరికీ BP, షుగర్తోపాటు క్యాన్సర్ పరీక్షలు చేయాలంది. ఈ వివరాలను NCD పోర్టల్లో అప్లోడ్ చేయాలంది. APR నుంచి వారంలో 2 రోజులు ఇళ్ల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని సూచించింది.

<<15496614>>జ్ఞానేశ్ కుమార్ను<<>> భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కేంద్రం ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ఎంపికను <<15494229>>కాంగ్రెస్<<>> వ్యతిరేకించింది. ప్రతిసారి PM నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీఈసీని ఎంపిక చేస్తుంది. ఇందులో CJI, లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే 2023లో ఈ కమిటీ నుంచి CJIని తొలగించిన కేంద్రం PM సూచించిన కేంద్రమంత్రిని అందులో చేర్చింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇక ఆనవాయితీ ప్రకారం ఎన్నికల సంఘంలో మోస్ట్ సీనియర్ను తదుపరి CECగా ఎన్నుకుంటూ వచ్చేవారు. ఆ విధానాన్నీ కేంద్రం పక్కనపెట్టడంతో విపక్షాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈనెల 19 లేదా 22న దానిపై విచారణ జరిగే అవకాశముంది. SC తీర్పు తర్వాతే CEC ఎంపిక చేపట్టాలని INC డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నిన్న PM నివాసంలో జరిగిన సమావేశంలోనూ LoP రాహుల్ గాంధీ లేవనెత్తారు. కానీ కేంద్రం నిన్న అర్ధరాత్రి CECని ప్రకటించేసింది.
Sorry, no posts matched your criteria.