India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలోని మసీదుల ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మొత్తం రూ.45 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేల చొప్పున అందనున్నాయి.

నేషనల్ క్రష్ రష్మిక బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. వరుస విజయాలతో బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రష్మిక నటించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ కలిపి రూ.2000+ కోట్ల వసూళ్లు రాబట్టాయి. అలాగే రణ్బీర్తో ‘యానిమల్’ సినిమాలో నటించి కష్టాల్లో ఉన్న బాలీవుడ్కు సుమారు రూ.1000 కోట్ల సినిమాను అందించారు. ఇప్పుడు విక్కీ కౌషల్ ‘ఛావా’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఇంట్లో శవమై <<15483613>>కనిపించిన<<>> సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24)ది ఆత్మహత్యేనని సియోల్ పోలీసులు నిర్ధారించారు. సె రాన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కాగా పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం పోలీసులు ఈ ప్రకటన చేశారు. 2000లో పుట్టిన సె రాన్ ‘ఏ బ్రాండ్ న్యూలైఫ్’ సినిమాలో నటనతో ఇంటర్నేషనల్ స్టార్డమ్ పొందారు. అతిచిన్న వయసులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకున్న నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

AP: దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలని CM చంద్రబాబు అన్నారు. భారతీయులు ఉన్న ప్రతి దేశంలోనూ బాలాజీ ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరిగిన టెంపుల్స్ కన్వెన్షన్ ఈవెంట్లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఓ AI నిపుణుడు తయారవుతున్నాడు. ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ ఉపయోగించాలి. రాష్ట్రంలోని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచాం’ అని వ్యాఖ్యానించారు.

TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవను 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు అతడిని విచారించనున్నారు. రామరాజ్యం పేరుతో ఓ వ్యవస్థను స్థాపించిన వీరరాఘవ ఇటీవల బృందంతో చిలుకూరు వెళ్లి తనకు మద్దతుతో పాటు డబ్బు ఇవ్వాలని రంగరాజన్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల CMలు స్పందించారు.

AP: దేవాలయాలు ఆథ్యాత్మిక కేంద్రాలే కాకుండా అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని CM చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేకమని చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ ఈవెంట్లో CM మాట్లాడారు. ‘ఆలయాలకు వచ్చిన విరాళాలను పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో ఆలయాలది కీలక పాత్ర. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగేయాలి’ అని పేర్కొన్నారు.

TG: ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కంపెనీ ఎఫ్ఈవో సీఈవోను ఏసీబీ అధికారులు వర్చువల్గా విచారించారు. రేస్ అగ్రిమెంట్లు, డబ్బు చెల్లింపులపై ప్రశ్నించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే ఏసీబీ విచారించింది.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని తన భార్య స్యూ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అన్నీ ఆలోచించాకే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా డుమినీ దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. 83 IPL మ్యాచ్లు కూడా ఆడారు.

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.

AP: మాజీ MLA వంశీని 10రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు, బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్లపై విజయవాడ SC, ST ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విని వాటి విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే వంశీకి ఇంటి నుంచి ఫుడ్ అందించాలన్న పిటిషన్నూ విచారించి ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. అటు గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ను కోర్టుకు తెచ్చి వాంగ్మూలం నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.