India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే తాను వెళ్లి స్వయంగా పరామర్శించానని అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పుడు తన అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. కానీ తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాల వల్లే వెళ్లలేకపోయానని, అందుకే నా సానుభూతి తెలియజేస్తూ వీడియో విడుదల చేశానని చెప్పారు. రేవతి మృతిపై ఎలా స్పందించాలనే దానిపై తాను ఇంకా పూర్తిగా క్లారిటీ తీసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
‘పుష్ప2’ ప్రీమియర్కు సంధ్య థియేటర్ వద్ద తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. తన కోసం ఎదురుచూస్తున్న వేలాది ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు. అనంతరం కాసేపు సినిమా చూసి వెళ్లిన తనకు తొక్కిసలాటపై మరుసటి రోజే తెలిసిందన్నారు. రేవతి మృతి గురించి తెలిసి ఆస్పత్రికి బయల్దేరినా, కేసు నమోదవడంతో వెళ్లొద్దని పోలీసులు, సన్నిహితులు చెప్పారని అల్లు అర్జున్ వెల్లడించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో ఎవరి తప్పూ లేదని ప్రెస్మీట్లో చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందన్నారు.
అల్లు అర్జున్ ప్రెస్మీట్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. రా.7 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని ప్రెస్కు సమాచారం ఇవ్వడంతో అంతా ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్నారు. కానీ రా.8 గంటలు కావొస్తున్నా అర్జున్ ఇంకా బయటికి రాకపోవడంతో మీడియా ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు కూడా బన్నీ ప్రెస్మీట్ ఎప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు-ఈశాన్య దిశగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 430కి.మీ, చెన్నైకి 490కి.మీ, గోపాల్పూర్(ఒడిశా)నకు 580కి.మీ దూరంలో ఉందని పేర్కొంది. ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
TG: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ సెటైరికల్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలన గురించి అర్థం వచ్చేలా సింగిల్ లైన్లో చమత్కరించింది. రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలన ఒక లైన్లో అని ‘ǝuı̣ꓶ ǝuO uı̣ ǝןnꓤ ɹɐǝ⅄ ǝuO ʇuǝɯuɹǝʌoꓨ ɥʇuɐʌǝꓤ’ ఇలా ‘X’ పోస్ట్ చేసింది. దీనిపై ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా కామెంట్లు పెడుతున్నారు.
దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(నవంబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. గత నెలలోనూ ఆయనే ఈ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా ఈ నెల కూడా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్-సికింద్రాబాద్ 723 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు రేపే(DEC-22) లాస్ట్ డేట్. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. మెటీరియల్ అసిస్టెంట్ & సివిల్ మోటార్ డ్రైవ్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య, ఇతర పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్: <
టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ లభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. భారత క్రికెట్కు అత్యుత్తమ సేవలందించిన యువరాజ్, ద్రవిడ్, సెహ్వాగ్, VVS లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ధోనీ, సురేశ్ రైనా, ధవన్, అశ్విన్లకు గుర్తుండిపోయే ఫేర్వెల్ ఇవ్వాల్సిందంటున్నారు.
Sorry, no posts matched your criteria.