India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని FIR నమోదైంది. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీస్ టీమ్ను అడ్డుకున్నారని, పబ్లిక్ సర్వెంట్స్పై దాడిచేశారని అందులో ప్రస్తావించారు. ఆమ్ఆద్మీ పార్టీలో అమనతుల్లా ఖాన్ కీలక నేత. CAA, NRC అల్లర్లు జరిగిన షాహీన్బాగ్ ఆయన నియోజకవర్గంలోనే ఉంది.

ఈ నెల 12న మాఘపౌర్ణమి రానుంది. మాఘ పౌర్ణమినాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పుణ్య నదులు, సముద్రంలో తలస్నానం ఆచరించాలి. సూర్య భగవానుడు, గంగా నదిని స్మరిస్తూ తర్పణాలు వదిలితే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని ప్రతీతి. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయాలి. ఆరోజు చేసే హోమాలకు, సత్యనారాయణస్వామి వ్రతానికి కోటి రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది.

2025, జనవరి 1న 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.71,500. నిన్న ఆల్ టైం రికార్డ్ ధర రూ.80,600కు చేరింది. అంటే 40రోజుల్లో రూ.9వేలకు పైగా పెరిగింది. ట్రంప్ రాకతో US డాలర్ బలపడగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో పసిడి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

చైనా, US మధ్య ట్రేడ్వార్ మరింత ముదురుతోంది. ట్రంప్ టారిఫ్స్కు ప్రతీకారంగా Nvidia, Apple, Google, Broadcom, Synopsys వంటి US టెక్ కంపెనీలపై చైనా స్క్రూటినీ ఆరంభించింది. ఆంక్షల అమలుకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టులను ఆలస్యం చేస్తోంది. దీంతో సప్లయి చైన్ దెబ్బతిని ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయా కంపెనీల వ్యూహాలు, ఉత్పత్తికి ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనా ట్రంప్, జిన్పింగ్లో ఎవరూ తగ్గేలా లేరు.

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సా.5.30 గం.కు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. రాత్రి 7.30 తర్వాత ఆయన రైలులో తమిళనాడు బయల్దేరతారు. రాహుల్ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

AP: గోదావరి జిల్లాల్లోని కానూరు, వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు. దీంతో మిగతా ప్రాంతాలవారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని, సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

రంజీ క్వార్టర్ ఫైనల్ 3లో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (108) సెంచరీతో సత్తా చాటారు. 180 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో ఆయన శతకం బాదారు. 100/3తో జట్టు కష్టాల్లో ఉండగా రహానే తన సెంచరీతో ఆదుకున్నారు. ఇదే మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ (70) ఫామ్లోకి వచ్చారు. ఈ మ్యాచులో సెంచరీ చేయడంతో రహానేను ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

స్టాక్మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లోనే మొదలయ్యాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ టారిఫ్స్ విధించడమే ఇందుకు కారణం. మరోవైపు డాలర్ విలువ పెరుగుదల సెంటిమెంటును దెబ్బతీసింది. నిఫ్టీ 23, 293 (-88), సెన్సెక్స్ 77,025 (-285) వద్ద ట్రేడవుతున్నాయి. IT షేర్లు బలం ప్రదర్శిస్తున్నాయి. ఫైనాన్స్, BANK, మీడియా, రియాల్టి, హెల్త్కేర్, O&G షేర్లు ఎరుపెక్కాయి. ADANIENT, GRASIM, APSEZ టాప్ గెయినర్స్.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.80,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో తొలిసారి రూ.87,930లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

మద్యం ధరలను పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాలు మందు బాబులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్ ధరలు తప్ప అన్ని బ్రాండ్ల మద్యం బాటిళ్లపై రూ.10లను ఎక్సైజ్ శాఖ పెంచింది. అటు తెలంగాణలో కేవలం బీర్ల ధరలనే పెంచారు. అన్నిరకాల బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 15% ధరలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
Sorry, no posts matched your criteria.