India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంగళగిరిలో కలిశారు. తండ్రి రమణతో కలిసి పవన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న సింధు వివాహం వెంకట దత్త సాయితో జరగనుండగా, 24న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలో జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగానదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం వస్తుందన్నారు.
బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. 10 రోజుల్లో ఈ సినిమాకు రూ.1292 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనతో గత రెండు రోజులుగా కలెక్షన్ల ప్రకటనకు దూరంగా ఉన్న మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. త్వరలోనే రూ.1500 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరే అవకాశం ఉంది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా లోక్ అదాలత్లో 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లు రిఫండ్ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 17,210 మంది బాధితులకు 155.22 కోట్లు రిఫండ్ చేసింది. గత ఏడాది కంటే రూ.27.2 కోట్లు అదనంగా రికవరీ చేయగా ఇది ఒక రికార్డని పేర్కొంది.
* రూ.30 లక్షలు: డేనియల్ గిబ్సన్(GG), అలనా కింగ్(UP)
* రూ.20 లక్షలు: అక్షితా మహేశ్వరి(MI)
* రూ.10 లక్షలు: ప్రకాశికా నాయక్(GG), సారా బ్రైస్, నిక్కీ ప్రసాద్(DC), జోషితా విజే, జాగ్రవీ పవార్, రఘ్వీ బిస్త్(RCB), సంస్కృతీ గుప్తా(MI), ఆరుషీ గోయల్, క్రాంతి గౌడ్(UP)
WPL వేలంలో భారత యంగ్ ప్లేయర్లు సిమ్రాన్ షేక్, కమలిని జాక్ పాట్ కొట్టేశారు. ఇవాళ్టి వేలంలో సిమ్రాన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు కమలినిని రూ.1.6 కోట్లకు ముంబై దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన సిమ్రాన్ బ్యాటర్ కాగా 16 ఏళ్ల కమలిని వికెట్ కీపర్, బ్యాటర్ కావడం గమనార్హం. 23 ఏళ్ల ప్రేమ్ రావత్ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సిమ్రాన్ అత్యధిక ధర పలికారు.
EVMల ట్యాంపరింగ్పై INDIA కూటమి చేస్తున్న విమర్శల నుంచి NC దూరం జరిగింది. ఆశించిన ఫలితాలు రానప్పుడు EVMలను నిందించడం తగదని JK CM ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. LS ఎన్నికల్లో 100 సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని, కొన్ని నెలలకే అనుకూల ఫలితాలు రాలేదని ఈవీఎంలపై మాట మార్చడం సరికాదన్నారు. ఈ విషయంలో తన వైఖరి బీజేపీ వాదనకు వత్తాసుపలకడం కాదన్నారు. వాస్తవాన్ని చెప్పానన్నారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుతో APలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. ‘ఆయన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఒక పూట తినకపోతేనే మనం తట్టుకోలేం. కానీ 58 రోజులు నిరాహార దీక్ష చేసి, అమరజీవి అయిన ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఆయన త్యాగం స్మరించుకునేలా HYDలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. NLR జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం’ అని CM గుర్తుచేశారు.
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 10 రోజుల్లోనే హిందీలో రూ.507.50 కోట్లు కలెక్ట్ చేసి, అత్యంత వేగంగా 500Cr క్లబ్లోకి అడుగుపెట్టిన మూవీగా నిలిచింది. దీంతో పుష్ప యూనిట్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. అలాగే రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి, అతి తక్కువ టైంలో ఈ రికార్డు సాధించిన సినిమాగా నిలిచింది.
WPL వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియాC తరఫున ఆడారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్రౌండర్ కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.