news

News November 14, 2024

IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

image

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్‌ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్‌లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

News November 14, 2024

DMK బిగ్గెస్ట్ డోనర్‌పై ED దాడులు.. WHAT NEXT?

image

తమిళనాడులో యాక్టర్ విజయ్ జోసెఫ్ కొత్త పార్టీతో అధికార DMKకు ఇప్పటికే తలనొప్పి ఎదురైనట్టు విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి బిగ్గెస్ట్ ఫండ్ డోనర్, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌ ఆస్తులపై ఈడీ నేడు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది. DMKకు వచ్చిన 90% ఎలక్టోరల్ బాండ్లను ఆయనే కొన్నారు. గతేడాది దాడుల్లోనే రూ.450 కోట్ల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసిన ED ఈసారి ఏం చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

News November 14, 2024

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

image

AP: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా మేఘనకు నీరభ్ శర్మ అశ్లీల చిత్రాలు పంపడంతో పాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తుండేవాడు. ప్రేమను అంగీకరించట్లేదనే కోపంతో ఇవాళ పెదగంట్యాడ మండలం బాలచెరువు సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి ఐరన్‌రాడ్డుతో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం యువకుడు పరారయ్యాడు. ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

News November 14, 2024

నా రూమ్‌కి వచ్చి తిలక్ ఏం అడిగారంటే.: సూర్య

image

నిన్నటి SAvsIND మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఆయన తన గదికి వచ్చారని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘3వ స్థానంలో తాను ఆడతానని తిలక్ నా రూమ్‌కి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు. అతడిపై విశ్వాసంతో సరేనన్నాను. ఆ నమ్మకాన్ని సెంచరీతో నిలబెట్టుకున్నారు’ అని కొనియాడారు. గత మ్యాచ్‌లలో సూర్య వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చారు.

News November 14, 2024

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆర్థిక మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆరా తీసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం ఎల్లుండి మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్ ఉంది.

News November 14, 2024

వరుణ్ తేజ్ ‘మట్కా’ రివ్యూ

image

చిన్నప్పటి నుంచి రౌడీయిజం ఫాలో అయిన హీరో గ్యాంబ్లింగ్ కింగ్‌గా ఎదగడం, చివరికి ఏమయ్యాడనేదే కథ. డిఫరెంట్ గెటప్‌లు, నటనతో వరుణ్ తేజ్ మెప్పించారు. కెమెరా వర్క్ బాగుంది. పాత స్టోరీని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ కరుణ కుమార్ ఫెయిల్ అయ్యారు. జి.వి ప్రకాశ్ మ్యూజిక్ తేలిపోయింది. స్టోరీ మధ్యలో ప్లేస్‌మెంట్ లేకుండా వచ్చే సాంగ్స్, లెంగ్తీ డైలాగ్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.
RATING: 2/5

News November 14, 2024

మండలిలో మా గొంతు నొక్కుతున్నారు: YCP ఎమ్మెల్సీలు

image

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమను పదే పదే అడ్డుకుంటున్నారని YCP MLCలు ఆరోపించారు. మండలిలో తమ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మా నాయకుడు జగన్ ఎక్కడికీ పారిపోలేదు. ఆయన ప్రతిపక్ష హోదా అడిగితే ఇప్పటివరకు స్పీకర్ స్పందించలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన సభకు వచ్చి ఏం లాభం? మమ్మల్ని అవహేళనగా మాట్లాడటం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.

News November 14, 2024

పోసానిపై వరుస ఫిర్యాదులు, శ్రీరెడ్డిపై కేసు

image

AP: YCP మద్దతుదారు పోసాని కృష్ణమురళిపై కూటమి నాయకులతో పాటు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన TDP అగ్రనేతలతో పాటు మద్దతుదారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సత్తెనపల్లి, ఫిరంగిపురం, బాపట్ల, సూళ్లూరుపేట, యర్రగొండపాలెం స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు, నటి శ్రీరెడ్డిపై విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైంది.

News November 14, 2024

తిలక్ వర్మ సూపర్ రికార్డ్

image

సౌతాఫ్రికాపై మూడో టీ20లో సెంచరీతో చెలరేగిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఓ సూపర్ రికార్డును సొంతం చేసుకున్నారు. SAపై శతకం బాదిన యంగెస్ట్ ప్లేయర్‌(22Y 5D)గా నిలిచారు. అలాగే T20Iల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన సెకండ్ యంగెస్ట్ ఆటగాడిగా ఘనత సాధించారు. 2023 ఆసియా గేమ్స్‌లో నేపాల్‌పై శతక్కొట్టిన యశస్వీ జైస్వాల్(21Y 279D) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

News November 14, 2024

ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీకి డొమినికా తమ దేశంలోని అత్యున్నత పురస్కారం ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రకటించింది. కొవిడ్-19 సమయంలో తమ దేశానికి భారత్ నుంచి అందిన సాయానికి కృతజ్ఞతగా, ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వివరించింది. వచ్చే వారం గయానాలోని జార్జ్ టౌన్‌లో జరిగే ఇండియా-కారికామ్ సదస్సులో డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నారు.