India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నటుడు మంచు విష్ణు ఈరోజు 12 గంటలకు <<14871804>>సంచలన ప్రకటన<<>> చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ‘హర హర మహాదేవ్’ అంటూ ఓ వార్త లింక్ను షేర్ చేశారు. హాలీవుడ్ దిగ్గజం విల్ స్మిత్తో విష్ణు నేతృత్వంలోని తరంగ వెంచర్స్ టైఅప్ అవనుందని వార్త సారాంశం. త్వరలోనే దీనిపై గుడ్ న్యూస్ రావొచ్చని చెప్పుకొచ్చారు. దీనిద్వారా OTT ప్లాట్ఫారమ్స్, యానిమేషన్, గేమింగ్స్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. ‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించలేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను చూపెట్టాలని మీడియాను కోరుతున్నా’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ, శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్టు. ఇది నా మాట కాదు.. ఇది జనం మాట!’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీజీ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ట్యాగ్ చేశారు.
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇండియా నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. దీంతో విదేశాల్లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. USలో 54,09,062 మంది భారతీయులు ఉన్నారు. UAEలో 35,68,848, మలేషియాలో 29,14,127, కెనడాలో 28,75,954, సౌదీ అరేబియాలో 24,63,509, మయన్మార్లో 20,02,660, UKలో 18,64,318, దక్షిణాఫ్రికాలో 17,00,000 మంది ఉన్నారు.
AP: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయని CM చంద్రబాబు అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్కు తమ పూర్తి మద్ధతు ఉంటుందని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం నడుస్తోంది. విజన్-2020లాగే విజన్-2047 కూడా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం చేపడుతున్నాం. అవగాహన లేకే YCP జమిలి ఎన్నికలపై ఏది పడితే అది మాట్లాడుతోంది’ అని ఆయన మండిపడ్డారు.
క్రికెట్కు ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. పేసర్ మహ్మద్ అమీర్, ఆల్రౌండర్ ఇమాద్ వసీం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కాగా అమీర్ గతంలో ఓసారి రిటైర్మెంట్ పలికారు. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తమ చివరి మ్యాచ్ ఆడేశారు.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పెంచింది. నేటితో ముగుస్తున్న డెడ్లైన్ను 14 జూన్ 2025 వరకు పొడిగించింది. పౌరులు ప్రతి పదేళ్లకు తమ సమాచారాన్ని ఆధార్లో అప్డేట్ చేస్తుండాలి. ఏజ్, పర్సనల్, అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి. ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI వెబ్సైట్ ద్వారా ఫ్రీగా మార్పులు చేసుకోవచ్చు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వర్షం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా డగౌట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఇద్దరూ లంచ్ బ్రేక్లో ఫుడ్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బాక్స్లోని ఫుడ్ తింటూ కనిపించారు. కాగా ఇవాళ మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడం అనుమానమే.
AP: విజన్-2047 పేరుతో చంద్రబాబు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. రాష్ట్రం దిశ మారాలంటే విజన్లు కాదని, విభజన హామీలు నెరవేరాలని మండిపడ్డారు. పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండి, వేలసంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి దక్కేదన్నారు. విభజన హామీలు బుట్టదాఖలు చేసినవారిలో మోదీ, CBN, జగన్ తొలి ముగ్గురు ముద్దాయిలని షర్మిల ధ్వజమెత్తారు.
OpenAI మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ కాపీరైట్, ఫెయిర్ యూజ్ నిబంధనలు పాటించడం లేదని అతడు బ్లాగులో ఆరోపించడం గమనార్హం. OpenAIతో విభేదించి బయటకొచ్చిన ఎలాన్ మస్క్ సుచిర్ మృతిపై ‘Hmmm’ అంటూ చేసిన ట్వీట్ సందేహాలు రేకెత్తిస్తోంది. ఘటనా స్థలంలో అనుమానాస్పద కదలికలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.