news

News December 12, 2024

గుడ్ న్యూస్.. పోస్టుల సంఖ్య పెంచిన SSC!

image

CHSL-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ SSC కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది. అంతకుముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టైర్-2 పరీక్ష పూర్తయింది. తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనుంది.

News December 12, 2024

భారీ వర్షాలు.. కీలక ఆదేశాలు

image

APలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ‘వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఫోన్ కాల్స్, SMSలతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలి’ అని ఆమె ఆదేశించారు.

News December 12, 2024

57 ఏళ్ల తర్వాత HYDలో సంతోష్ ఫుట్‌బాల్ టోర్నీ

image

మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

News December 12, 2024

6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP

image

AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్‌లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.

News December 12, 2024

ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

image

దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.

News December 12, 2024

కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.

News December 12, 2024

రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

image

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.

News December 12, 2024

ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమా ఇదే!

image

అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాల జాబితాను IMDb ప్రకటించింది. జనవరి 1 నుంచి నవంబర్ 25వ తేదీ మధ్య విడుదలైన అన్ని చిత్రాల్లో రేటింగ్స్ బట్టి టాప్-10 జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా టాప్-1లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ‘స్త్రీ-2’, మహారాజా, సైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భులయ్యా-3, కిల్, సింగమ్ అగైన్, లాపతా లేడీస్ ఉన్నాయి.

News December 12, 2024

అమరావతికి మరో గుడ్‌న్యూస్

image

AP రాజధాని అమరావతికి రూ.8వేల కోట్ల రుణం మంజూరుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది. రుణాన్ని ఆమోదిస్తూ ADB బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోగా, ఇవాళ్టి కలెక్టర్ల సమావేశంలో CRDA కమిషనర్ ఆ విషయం వెల్లడించారు. ఈ నెల 19న జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో ఆమోదం తర్వాత ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకోనున్నారు. తొలి విడతలో రూ.3వేల కోట్లు రిలీజ్ కానున్నాయి. ఆ తర్వాత మిగతావి విడుదలవుతాయి.

News December 12, 2024

రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. స్పందించిన బన్నీ టీమ్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధార, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. అనధికార సమాచారాన్ని షేర్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. సరైన వివరాలకు టీమ్ ఇచ్చే అప్డేట్స్‌ను అనుసరించాలని సూచించింది.