India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.
4 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ T20 నేడు జరగనుంది. జొహనెస్బర్గ్లో రాత్రి 8.30గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టుబిగించాలని ఇటు మెన్ ఇన్ బ్లూ, అటు ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్ కాస్త పేస్కు అనుకూలించే ఛాన్సుంది.
TG: అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘‘అదానీ ఫ్రాడ్’ అని రాహుల్ గాంధీ అంటుంటే, ‘అదానీ నాకు ఫ్రెండ్’ అని రేవంత్ అంటున్నారు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ బెహతరీన్(అద్భుతం) అని రేవంత్ అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే అలాంటి ఫ్రాడ్ దగ్గరికి కాంగ్రెస్ CM రేవంత్ వెళుతున్నారు’’ అని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో KTR అన్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’పై భారీ అంచనాలే ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కొన్ని విజువల్స్ చూశానని, అవి హ్యారీపోటర్ను తలపించాయని అన్నారు. ఇంట్రెస్టింగ్గా అనిపించాయని ప్రశంసించారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు విష్ణువు 4 నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఇవాళ ఇంట్లో తులసి మొక్కకు విష్ణుతో వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.
అమ్మాయిలు వెంట్రుకలను వెనక్కి గట్టిగా లాగి పోనీ టేల్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోనీ టేల్స్ వల్ల హెడేక్ రావడంతో పాటు మెడ నరాల్లో నొప్పి పెరిగి నడుము నొప్పి రావొచ్చు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవుతుంది. దురద వల్ల అసౌకర్యానికి లోనవుతారు. నరాలపైన ఒత్తిడి పెరిగి మైగ్రేన్ హెడేక్కు దారితీయవచ్చు’ అని చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ఇలా చేయడం మానేయాలంటున్నారు. SHARE IT
నిత్యం వినియోగించే టూత్ పేస్టుల్లో కలర్ కోడ్స్ ఉండటం గమనించారా? ఇవేమీ డిజైన్ కోసం వేసినవి కాదు. మొత్తం నాలుగు రంగుల స్ట్రిప్స్ను టూత్ పేస్ట్ కవర్పై చూడవచ్చు. ఇందులో బ్లూ రంగు న్యాచురల్ & మెడిసిన్స్తో కూడినదని సూచిస్తుంది. రెడ్ కలర్ న్యాచురల్ & కెమికల్స్ యాడ్ చేసినదని, గ్రీన్ కలర్ ఉంటే న్యాచురల్గా తయారుచేసిందన్నమాట. ఇక స్ట్రిప్పై బ్లాక్ కలర్ ఉంటే అది పూర్తిగా కెమికల్స్తో చేసిందని అర్థం.
TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని CM రేవంత్ అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
* 1780: భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం.
* 1935: సినిమా నేపథ్య గాయని పి.సుశీల జననం.
* 1973: భారత స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం.
* 1990: మొట్టమొదటి వెబ్ పేజీ తయారీ.
* 2002: ప్రజా కవి, పద్మవిభూషణ గ్రహీత కాళోజీ నారాయణరావు మరణం.(ఫొటోలో)
శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరగనుంది. డంబుల్లా వేదికగా మధ్యాహ్నం 2.30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్నైనా గెలవాలని శ్రీలంక భావిస్తోంది. అటు లంకేయుల చేతిలో ఇటీవల టెస్టుల్లో ఎదురైన పరాభవానికి బదులుగా ఈ సిరీస్ గెలవాలని కివీస్ భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.