news

News February 8, 2025

అదానీ మంచి మనసు.. రూ.10,000 కోట్ల డొనేషన్

image

కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. ‘సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ’ అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.

News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.

News February 8, 2025

మనీశ్ సిసోడియా ఓటమి

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.

News February 8, 2025

వెలువడుతున్న ఫలితాలు.. బీజేపీ 4, ఆప్ 1

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లీడింగ్‌లో కొనసాగిన BJP, AAP విజయాలు నమోదు చేస్తున్నాయి. BJP 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. మరో 42స్థానాల్లో కమలదళం, 23చోట్ల ‘చీపురు’ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆప్ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా వెనుక పడిపోవడంతో ఆధిక్యం 23కు తగ్గింది. అగ్రనేతలే ఆ పార్టీకి భారం కావడం గమనార్హం.

News February 8, 2025

1000 వికెట్లు సాధించడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్

image

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు(461 మ్యాచుల్లో 633 వికెట్లు) తీసిన అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 1000 వికెట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1000 వికెట్లు దక్కించుకోవడమనేది నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత. ఫిట్‌గా ఉండి, ఇప్పుడు ఆడుతున్న స్థాయిలోనే ఆడితే మరో మూడు, నాలుగేళ్లలో కచ్చితంగా తీస్తా. 4అంకెల వికెట్లు అనేది బౌలర్ ఊహకు మాత్రమే సాధ్యం’ అని పేర్కొన్నారు.

News February 8, 2025

‘ఢిల్లీ కింగ్‌మేకర్: నిర్మలా సీతారామన్’

image

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి FM నిర్మలా సీతారామనే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నగరంలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటారు. వారి చిరకాల కోరికైన Income Tax తగ్గింపును నిర్మలమ్మే తీర్చారని పేర్కొంటున్నారు. 50:50 ఉన్న విజయ సమీకరణాన్ని ఆమె BJP వైపు మార్చేశారని విశ్లేషిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో 50% కన్నా ఎక్కువ వారికే పడటం దీనిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

News February 8, 2025

ఢిల్లీలో తొలి గెలుపు ఎవరిదంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు.

News February 8, 2025

ట్విటర్‌లో ‘EVM HACK’ ట్రెండింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ ‘EVM HACK’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపు ఉన్నారని, ఫలితాలు సరైనవి కావంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. EVMలను హ్యాక్ చేసే అవకాశం ఉందనే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ పెట్టారంటున్నారు. అయితే, మరికొందరు ‘ఓటమిని అంగీకరించకుండా ఇప్పుడు EVM హ్యాక్ అయిందని పోస్టులు పెడతారు’ అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News February 8, 2025

మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు

image

మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ <<15374455>>వీడియోల<<>> కేసులో ఓ AP అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ SP స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

News February 8, 2025

ఓటమి దిశగా సీఎం ఆతిశీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్‌లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజ్రీవాల్‌పైనా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ ఆధిక్యంలో ఉన్నారు.