India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము లిక్కర్ విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని అధికారులను సీఎం ఆదేశించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్నారు.
రేపు సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఆయన CDPని నటుడు రానా రిలీజ్ చేశారు. వెంకీ కొత్త మూవీ, వింటేజ్ లుక్తో కూడిన ఫొటోలను ఇందులో పొందుపరిచారు. 7 నంది అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకున్నారని పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు వెంకీ మామకు సినీ వర్గాలు ముందుగానే బర్త్ డే విషెస్ చెబుతున్నాయి. వెంకటేశ్ నటిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ JAN 14న రిలీజ్ కానుంది.
‘పుష్ప-2’ సినిమా ఫస్ట్ వీక్లో రూ.1067కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తొలి వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది. నిన్న రూ.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో రూ.31.50 కోట్లు హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో <<14859693>>ఈ చట్టాన్ని<<>> ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 1947, AUG 15 నాటికి ఉన్న మతపరమైన స్థలాలను మరో మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. అయోధ్య రామ మందిరాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు. చట్టం తీసుకొచ్చే నాటికి కోర్టులో దీనిపై వ్యాజ్యం నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్కు అభినందనలు తెలుపుతూ ఇన్స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.
ప్రపంచ చెస్ ఛాంఫియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.
CHSL-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ SSC కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది. అంతకుముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టైర్-2 పరీక్ష పూర్తయింది. తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్తో భర్తీ చేయనుంది.
APలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ‘వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఫోన్ కాల్స్, SMSలతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలి’ అని ఆమె ఆదేశించారు.
మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.