news

News February 8, 2025

అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే

image

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్‌పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.

News February 8, 2025

1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్

image

న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

News February 8, 2025

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

News February 8, 2025

‘తండేల్’ తొలి రోజు కలెక్షన్లు ఎన్నంటే?

image

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.21.27 కోట్లు(గ్రాస్) వచ్చినట్లు తెలిపారు. అయితే చైతూ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News February 8, 2025

రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేస్తే బెటర్: బంగర్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేస్తే మంచిదని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ఏం చేసినా పరుగులు రాని దశను రోహిత్ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దశలో ఆయన సాధన ఆపేయడమే బెటర్. దాని బదులు ఒంటికి విశ్రాంతినిచ్చి తాను అద్భుతంగా ఆడినప్పటి ఇన్నింగ్స్‌ను చూడాలి. అప్పుడెందుకు బాగా ఆడారో అర్థం చేసుకోవాలి. రన్స్ కోసం ఆయన ట్రై చేసే కొద్దీ పరిస్థితి మరింత దిగజారొచ్చు’ అని పేర్కొన్నారు.

News February 8, 2025

ఆప్‌ను గెలిపించే బాధ్యత మాది కాదు: కాంగ్రెస్

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించే బాధ్యతేమీ తమకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు. ‘వారి గెలుపు బాధ్యత మాది కాదు కదా? స్ఫూర్తిదాయకమైన పోరాటంతో ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడమే మా బాధ్యత. కేజ్రీవాల్ గోవా, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు కదా? గోవా, ఉత్తరాఖండ్‌లో ఆప్‌కు వచ్చిన ఓట్ల తేడాతోనే మేం ఓడిపోయాం’ అని గుర్తుచేశారు.

News February 8, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

image

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.

News February 8, 2025

చంద్రబాబు ప్రచారం చేసిన చోట్ల BJPకి ఆధిక్యం

image

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.

News February 8, 2025

ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

image

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

News February 8, 2025

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

image

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.