India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.
వినూత్నంగా రూపొందించిన ఓ శుభలేఖ వైరలవుతోంది. ఇందులో వధువు, వరుడు పేరుకు బదులు శర్మాజీ కూతురితో గోపాల్ జీ కొడుకు వివాహం అని రాశారు. టింకూ పరీక్షలు జనవరి 5న పూర్తవుతుండటంతో అదేరోజు పెళ్లి జరుగుతుందని ముహూర్తం గురించి రాసుకొచ్చారు. పెళ్లికి వచ్చేవారు గిఫ్టులు తేవొద్దని, కేవలం క్యాష్, గూగుల్ పే ద్వారా డబ్బును పంపాలని సూచించారు. ఫుడ్ గురించి చెప్తూ రూ.2000కు ఓ ప్లేట్ అని, వేస్ట్ చేయొద్దని కోరారు.
AP: అమరావతి ప్రజా రాజధాని అని, యువతకు ఉపాధి కల్పించే ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో రూ.20,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
డిగ్రీ పూర్తి చేయాలనే సంకల్పం ముందు వృద్ధాప్యం చిన్నబోయింది. అమెరికాలోని న్యూ హాంప్షైర్కు చెందిన 90ఏళ్ల రాబర్జ్ న్యూ హాంప్షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తిచేసే వరకూ నిద్రపోనని ఆమె చెప్తున్నారు. ఆమె ఇదివరకు సమీపంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతో పాటు బీమా ఏజెంట్గా పనిచేసేవారు. ఆమెకు ఐదుగురు పిల్లలుండగా 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు.
AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.
‘పుష్ప-2’ సినిమాలో ‘తగ్గేదేలే’ అని చెప్పే ప్రతి సీన్ తన ఫేవరెటేనని హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన భారతీయులకు ఐకాన్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప అంటే ఫైర్ కాదని, వెల్డ్ ఫైర్ అని హిందీలో డైలాగ్ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్దేనని పేర్కొన్నారు.
దేశంలో 1952లో తొలి సాధారణ(జమిలి) ఎన్నికలు జరగగా 1967 వరకు కొనసాగాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం, ముందుగానే అసెంబ్లీలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడంతో గడువులు మారాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
స్వర్ణాంధ్ర-2047 విజన్తో రాష్ట్రాన్ని నం.1గా నిలబెడతామని CM చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. మెగా DSC, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, పలు కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. దీపం-2 పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఈనెల 14న మొదటి పాట విడుదల కానుంది. రేపు ఉ.10.08 గంటలకు ప్రోమోను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. 2025 జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Sorry, no posts matched your criteria.