news

News November 12, 2024

తప్పకుండా చదవాల్సిన తెలుగు పుస్తకాలు!

image

పుస్తకాలు చదవడం వల్ల మనిషికి తన గురించీ, సమాజం గురించీ, ప్రకృతి గురించీ అవగాహన పెరుగుతుందంటారు. అయితే, ఏ పుస్తకాలు చదవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఓ నెటిజన్ పుస్తకాలు, వాటి రచయితకు సంబంధించిన జాబితాను షేర్ చేశారు. ఇందులో గురజాడ రాసిన కన్యాశుల్కం నుంచి మొదలై వందల పుస్తకాలున్నాయి. వీటిలో మీరెన్ని పుస్తకాలు చదివారు? ఏ పుస్తకమంటే ఇష్టమో కామెంట్ చేయండి. పుస్తక ప్రియులకు షేర్ చేయండి.

News November 12, 2024

2.5లక్షల మందికి జాబ్స్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ 500 బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇవి మూడేళ్లలో పూర్తవుతాయని, ఒక్కో ప్లాంటును ₹131కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా రాష్ట్రానికి ₹7వేల కోట్ల ఆదాయం వస్తుందని, సీజీబీకి ఉపయోగపడే పంటలతో రైతులకు ఎకరాకు ₹30వేల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

News November 12, 2024

నా భర్త సినిమాలు కొన్ని అస్సలు నచ్చవు: మోహన్‌లాల్ భార్య

image

తన భర్త సినిమాలు అందరికీ నచ్చినా తనకు మాత్రం కొన్ని నచ్చవని మలయాళ స్టార్ మోహన్‌లాల్ భార్య సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన సినిమాలు కొన్నింటిని అస్సలు చూడలేకపోయాను. ఆ విషయాన్ని ఆయనతో కరాఖండీగా చెబుతుంటాను. నా అభిప్రాయాలు ఎలా ఉన్నా సినిమా వెనుక ఉన్న కృషిని మాత్రం గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు. మోహన్‌లాల్-సుచిత్ర 1988లో పెళ్లాడగా వారికి ప్రణయ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలున్నారు.

News November 12, 2024

2027 లేదా 2028 నాటికి పోలవరం పూర్తి: సీఎం

image

AP: పోలవరం ప్రాజెక్టును 2027 లేదా 2028 నాటికి పూర్తి చేస్తామని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు వెల్లడించారు. ‘ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చింది. దీంతో ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఫేజ్-2లో R&R, భూసేకరణ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ ఏడాది పోలవరం నుంచి అనకాపల్లి, విశాఖకు నీళ్లు తీసుకెళ్తాం. అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు అనుసంధానం చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 12, 2024

గుండె పదిలంగా ఉండాలంటే..!

image

పదికాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలంటే పొట్ట తగ్గించి నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘పోషక ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు తినాలి. కూల్ డ్రింక్స్ వద్దు. వంటల్లో తక్కువ మోతాదులో ఉప్పు వాడండి. పొట్ట నిండా తినడం మానేయండి. ప్రతిరోజూ అరగంట – గంట వ్యాయామం తప్పనిసరి. మద్యం ముట్టకండి. పొగాకు దరిచేరనీయవద్దు. 7-9 గంటలు పడుకోండి. వీలైనంత ప్రకృతితో గడపండి’ అని తెలిపారు.

News November 12, 2024

BIG BREAKING: గ్రూప్-2 వాయిదా

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు APPSC వెబ్‌సైటును చూడాలని సూచించింది.

News November 12, 2024

MLAలు ప్రజలతో మమేకం కావాలి: CM

image

AP: NDA MLAలంతా ప్రజలతో మమేకం కావాలని CM చంద్రబాబు కోరారు. NDA శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2029లో మీ అందరినీ MLAలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా. MLA ఛైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. స్థానిక టూరిజం అభివృద్ధికి MLAలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి. సమస్యలు నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా’ అని వెల్లడించారు.

News November 12, 2024

స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్

image

తెలంగాణలోని గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని UTF డిమాండ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుగుణంగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకే ఉండేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాగా రాత్రి వరకు స్కూళ్లు ఉండటంతో తాము ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

News November 12, 2024

Elections: ఈ ప్రాంతాల్లో రేపే ఓట్ల పండుగ‌

image

దేశంలో మ‌రోసారి ఓట్ల పండుగ‌కు స‌మ‌య‌మొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొద‌టి విడ‌త ఎన్నిక‌లు బుధ‌వారం జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20 ST, 6 SC) 685 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. అలాగే వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి కూడా రేపే ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 47 అసెంబ్లీ స్థానాల‌కు ఈసీ బైపోల్స్ నిర్వ‌హించ‌నుంది. న‌వంబ‌ర్ 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

News November 12, 2024

Inflation: సామాన్యులపై ధరల మోత

image

కూర‌గాయ‌లు, పండ్లు, నూనెలు ఇత‌ర‌త్రా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో అక్టోబ‌ర్‌లో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 14 నెల‌ల గ‌రిష్టాన్ని తాకి 6.21%గా న‌మోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% ల‌క్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా న‌మోదవ్వ‌డం గ‌మ‌నార్హం. అర్బ‌న్ ప్రాంత ద్ర‌వ్యోల్బ‌ణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా న‌మోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.