news

News December 12, 2024

గ్రేట్.. తొమ్మిది నెలల గర్భంతో భరతనాట్యం

image

భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.

News December 12, 2024

ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.

News December 12, 2024

క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!

image

రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

News December 12, 2024

ప్రపంచంలోనే అరుదైన రక్తం ఇదే!

image

ప్రపంచంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ Rh-null అనేది అరుదైన రక్త సమూహంగా పరిగణిస్తుంటారు. దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే తక్కువ మంది మాత్రమే ఈ ప్రత్యేకమైన రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు. ఇది అరుదుగా ఉండటం వల్ల దీనిని విలువైనదిగా భావిస్తారు. యాంటీజెన్స్ ఉండవు కాబట్టి Rh వర్గం వారికి వినియోగించాల్సి వచ్చినపుడు దీని మ్యాచ్‌ను కనుగొనడం చాలా కష్టం.

News December 12, 2024

100 రోజుల యాక్షన్ ప్లాన్: లోకేశ్

image

ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.

News December 12, 2024

ఇలాంటి వెడ్డింగ్ కార్డును చూసుండరు!

image

వినూత్నంగా రూపొందించిన ఓ శుభలేఖ వైరలవుతోంది. ఇందులో వధువు, వరుడు పేరుకు బదులు శర్మాజీ కూతురితో గోపాల్ జీ కొడుకు వివాహం అని రాశారు. టింకూ పరీక్షలు జనవరి 5న పూర్తవుతుండటంతో అదేరోజు పెళ్లి జరుగుతుందని ముహూర్తం గురించి రాసుకొచ్చారు. పెళ్లికి వచ్చేవారు గిఫ్టులు తేవొద్దని, కేవలం క్యాష్, గూగుల్ పే ద్వారా డబ్బును పంపాలని సూచించారు. ఫుడ్ గురించి చెప్తూ రూ.2000కు ఓ ప్లేట్ అని, వేస్ట్ చేయొద్దని కోరారు.

News December 12, 2024

ఉపాధి కల్పించే రాజధానిగా అమరావతి: సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి ప్రజా రాజధాని అని, యువతకు ఉపాధి కల్పించే ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో రూ.20,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

News December 12, 2024

90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన వృద్ధురాలు

image

డిగ్రీ పూర్తి చేయాలనే సంకల్పం ముందు వృద్ధాప్యం చిన్నబోయింది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 90ఏళ్ల రాబర్జ్ న్యూ హాంప్‌షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తిచేసే వరకూ నిద్రపోనని ఆమె చెప్తున్నారు. ఆమె ఇదివరకు సమీపంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతో పాటు బీమా ఏజెంట్‌గా పనిచేసేవారు. ఆమెకు ఐదుగురు పిల్లలుండగా 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు.

News December 12, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

News December 12, 2024

ఈనెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: మంత్రి

image

AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.