news

News December 12, 2024

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు.. రేపు లాటరీ

image

AP: అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని కార్యాలయంలో డిసెంబర్ 12న లాటరీ తీయనున్నట్లు CRDA కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News December 12, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఇసుక విషయంలో అధికారులదే బాధ్యత: పవన్ కళ్యాణ్
* ఇంటర్, SSC పరీక్షల షెడ్యూల్ విడుదల
* TG: మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్
* కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్
* సీపీ విచారణకు మంచు విష్ణు, మనోజ్ హాజరు
* ఈ నెల 24 వరకు విచారణకు హాజరవ్వకుండా మోహన్ బాబుకు ఊరట
* రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటిన ‘పుష్ప-2’

News December 12, 2024

కాబూల్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి

image

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనితో సహా 12 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను తాలిబన్ మీడియా రిలీజ్ చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News December 12, 2024

పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన APPSC

image

AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను మార్చి 16వ తేదీ ఉదయం 9.30 నుంచి మ.12 వరకు నిర్వహించనుంది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను మార్చి 17వ తేదీన ఉదయం 9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 12, 2024

జమిలి ఎన్నికలకు డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. రేపు క్యాబినెట్ ముందుకు?

image

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News December 12, 2024

EPFO ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్

image

EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.

News December 12, 2024

డిసెంబ‌ర్ 14న మ‌హారాష్ట్ర క్యాబినెట్ విస్త‌ర‌ణ‌!

image

త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం మ‌హాయుతిలో CM అభ్య‌ర్థిత్వం కొలిక్కి వ‌చ్చింది. అయితే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పీఠ‌ముడి వీడ‌డం లేదు. కీల‌క శాఖ‌ల కోసం మిత్ర‌ప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. మ‌ధ్యేమార్గంగా మీక‌ది-మాకిది అన్నట్టుగా శాఖ‌లు పంచుకోవాల‌ని నిర్ణ‌యించాయి. 42 మందిని మంత్రులుగా నియ‌మించే అవకాశం ఉండడంతో మొత్తంగా BJPకి 21-22, శివ‌సేనకి 12-13, NCPకి 7-8 ద‌క్క‌వ‌చ్చు. Dec 14న విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.

News December 11, 2024

SHOCKING: ప్రపంచంపైకి మరో మహమ్మారి?

image

కరోనా మహమ్మారి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో చూశాం. చైనాలోని ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీకైందన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ప్రమాదకరమైన పలు వైరస్‌లు మిస్ కావడం కలకలం రేపుతోంది. హెండ్రా వైరస్, లిస్సా వైరస్, హంటా వైరస్ వంటివి వాటిలో ఉన్నాయని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News December 11, 2024

ఎంట్రీ ఇచ్చిన 26 నెలల్లోనే నం.1 ర్యాంకు

image

ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నం.1 బ్యాటర్‌‌గా నిలిచారు. 2022 సెప్టెంబర్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఈ ప్లేయర్ కేవలం 26 నెలల్లోనే తొలి స్థానానికి ఎదిగారు. ఇప్పటివరకు 23 టెస్టులు ఆడిన బ్రూక్ 2,280 పరుగులు చేశారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

News December 11, 2024

2034లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఎక్కడంటే?

image

ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.