India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నీళ్ల నుంచి విద్యుత్ తయారుచేసే యోచనలో సైంటిస్టులున్నట్లు తెలుస్తోంది. మానవ కన్నీళ్లలో నాక్రే అనే మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉన్నట్లు వారు గుర్తించారు. ఇవి ఒత్తిడికి గురైనప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని పరిశోధనలో తేలినట్లు తెలుస్తోంది. ఇది కన్నీళ్ల నుంచి బయోఎలక్ట్రిక్ ఎనర్జీని ఉపయోగించడంపై ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో దీనిపై మరింత పరిశోధన చేసే అవకాశం ఉంది.
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్తో పాటు సెక్యూరిటీ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
AP: పదో తరగతి పరీక్షల <
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.
IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్లపై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌదరీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజర్ రూల్స్-2015 ప్రకారమే Clerkage fee వసూలు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశారని ప్రశ్నిస్తే, ఆ వివరాలు విడిగా తమ వద్ద లేవని బదులిచ్చింది.
TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.
AP: రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు లేవని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తం 5.4 కోట్ల మంది జనాభాకు 4.9 కోట్ల మంది వివరాలే ఉన్నాయని వెల్లడించింది. మిగతా వారి వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. గత సర్వేల్లో చేసిన వివరాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు.
గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురానుంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు, సామాజిక భద్రత లేవు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ-కామర్స్, సేవా రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఓ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 70 లక్షల మంది వర్కర్లు ఉన్నట్టు అంచనా.
డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ మొబిక్విక్ IPOకు Retail Investors నుంచి అనూహ్య స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన IPO మొదటి గంటలోనే పూర్తిగా సబ్స్ర్కైబ్ అవ్వడం గమనార్హం. ₹265-279 Price Bandతో ఆఫర్ చేసిన 1.18 కోట్ల షేర్లకు 2.17 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. AI , సేవల విస్తృతికై ఈ Fintech సంస్థ ₹572 కోట్ల సమీకరణకు ఐపీవోకు రాగా 7.6% అధికంగా సబ్స్ర్కిప్షన్ డిమాండ్ ఏర్పడింది.
ప్రయాణికులు లేకున్నా విద్యార్థి చదువు కోసం రైలును కొనసాగించిన ఘటన జపాన్లో జరిగింది. హక్కైడోలో క్యుషిరటాకి అనే రైల్వే స్టేషన్లో కనా హరాడా అనే విద్యార్థి మాత్రమే రోజూ ప్రయాణించేది. రైలు ఆపితే ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని డిగ్రీ పూర్తయ్యేవరకూ ట్రైన్ కొనసాగించారు. అదే మన దగ్గర వరంగల్ జిల్లా నెక్కొండలో ప్రయాణికులు లేకుంటే రైలు నిలుపరని, ప్రజలే చందాలు వేసుకుని రోజూ టికెట్స్ కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.