India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: డిసెంబర్ 10, మంగళవారం
దశమి: రా.3.43 గంటలకు
ఉత్తరాభాద్ర: మ.1.30 గంటలకు
వర్జ్యం: రా.12.39-2.08 గంటల వరకు
దుర్ముహూర్తం: 1)ఉ.8.39-9.24 గంటల వరకు
2)రా.10.43-11.34గంటల వరకు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చంపుతానని ఆయన పేషీకి కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విజయవాడకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అటు, తనకు కూడా 2రోజుల కిందట ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పిన హోంమంత్రి అనిత.. ఆగంతకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని ఆదేశించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
* గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: రేవంత్
* ప్రభుత్వం పెట్టింది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
* నాగబాబుకు మంత్రి పదవి.. నిర్ణయించిన CBN
* రాజ్యసభ సభ్యులుగా మస్తాన్రావు(TDP), సానా సతీశ్(TDP), ఆర్.కృష్ణయ్య(BJP) పేర్లు ఖరారు
* RBI కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా
* TG గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
* పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మోహన్బాబు, మనోజ్
ప్రోకబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ దారుణంగా ఓడిపోయింది. హరియాణా స్టీలర్స్తో జరిగిన మ్యాచులో 46-25 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. TTలో ఆశిష్ నర్వాల్ సూపర్ 10 సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ను శుద్ధమైన బయోఫ్యూయల్గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్కరించిన ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ నమూనా ప్రస్తుతం 5L పరిమాణంలో ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ఆవిష్కరణలో ఇది కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశానని, ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యూటీ కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
లోన్ అప్రూవ్ చేయడానికి ఓ కస్టమర్ నుంచి ₹39 వేల కోడి మాంసం ఆరగించాడో బ్యాంకు మేనేజర్. ఛత్తీస్గఢ్లోని మస్తూరీకి చెందిన రూప్చంద్ పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ₹12 లక్షల రుణం కోసం SBI మేనేజర్ను కలిశారు. ఆయన 10% కమీషన్ తీసుకున్నారు. అలాగే ప్రతి శనివారం చికెన్ పంపాల్సిందిగా ఆదేశించారు. ₹39K కోడి మాంసం ఆరగించినా లోన్ మంజూరు చేయకపోవడంపై బాధితుడు మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు.
INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.