India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది. మొన్న ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమైపోయాయి. తెలంగాణ తల్లి అని చెప్పి సీఎం బిల్డప్ ఇస్తున్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ మాయమైంది. విగ్రహ రూపంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సివిల్స్-2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC రిలీజ్ చేసింది. ఇక్కడ <
TG: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.
TG: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు పార్టీలు పోరాటం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆలె నరేంద్ర, విజయశాంతి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి వారు తమ రాజకీయ పార్టీల ఆలోచన, విధివిధానాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని ముందుకు కొనసాగాయి. కానీ 2014లో జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని గత పాలకులు నిర్వహించలేదు’ అని సీఎం విమర్శించారు.
శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయంతో ఆ జట్టు WTC ఫైనల్కు మరింత చేరువైంది. ప్రస్తుతం SA పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్తో జరిగే రెండు టెస్టు మ్యాచుల సిరీస్ను 1-0తో నెగ్గినా సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుంది. మరోవైపు భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై 3-2/3-1 తేడాతో సిరీస్ గెలవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 2, భారత్ 3 స్థానాల్లో ఉన్నాయి.
పార్లమెంటు ఉభయ సభల్లో ఈ వారం రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ ప్రారంభంకానుంది. శుక్రవారం లోక్సభలో రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చివరగా శనివారం PM మోదీ చర్చపై సమాధానమిస్తారు. రాజ్యసభలో 16న అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. 17న మోదీ రిప్లై ఇస్తారు. ఇటీవల రాజ్యాంగం చుట్టూ రాజకీయాలు జోరందుకోవడంతో చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
వారానికి నాలుగు రోజులే పనిచేసేలా కొత్త రూల్ను టోక్యో పరిచయం చేస్తోంది. పనిచేసే తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం, దేశ సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ జనాభా సంక్షోభం నేపథ్యంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను ఇంప్రూవ్ చేయడం, కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ రూల్పై మీ అభిప్రాయం ఏంటి?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్పై అప్టేడ్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.