news

News February 5, 2025

ఇండియాలో కాలుష్యంపై బ్రయాన్ ఏమన్నారంటే?

image

అమెరికన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఇండియాలో పర్యటిస్తుండగా నిఖిల్ కామత్ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాలుష్యమేనని బ్రయాన్ చెప్పుకొచ్చారు. ‘గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో నేను ఇంటర్వ్యూ మధ్యలో ఆపేశా. వాయుకాలుష్యం వల్ల నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లు, గొంతు మండిపోతున్నాయి. నేను తెచ్చిన ఎయిర్ ప్యూరిఫయర్ కూడా కాలుష్యానికి పాడైంది’ అని చెప్పారు.

News February 5, 2025

ప్రైవేటు వీడియోల కేసు.. డ్రగ్ టెస్ట్‌లో నిందితులకు పాజిటివ్

image

అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ టెస్ట్‌లో మస్తాన్ సాయి, అతని ఫ్రెండ్ ఖాజాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మస్తాన్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022లో తన ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ సమయంలో తనకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 5, 2025

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-2లో అభిషేక్ శర్మ

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చారు. మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 38 స్థానాలు మెరుగుపరుచుకొని రెండవ ర్యాంకుకు చేరారు. తొలి స్థానంలో ట్రావిస్ హెడ్ ఉండగా మూడో స్థానంలో తిలక్ వర్మ ఉన్నారు. వన్డేల్లో రోహిత్, గిల్, కోహ్లీ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు వన్డే, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది.

News February 5, 2025

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్

image

TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 5, 2025

‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం

image

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

News February 5, 2025

గూగుల్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ

image

AP:గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్‌తో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

News February 5, 2025

మాదిగలకు 11శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: మందకృష్ణ

image

TG: జనాభా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలో 32 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని చెప్పారు. వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మందే మాలలు ఉన్నారన్నారు. మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. కమిషన్ సిఫార్సు చేసిన గ్రూపుల్లో కులాల కేటాయింపు సరిగ్గా లేదని ఆరోపించారు.

News February 5, 2025

BREAKING: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

image

AP: విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410KMగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న AP రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు, విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్‌పాడ్ రూట్లను సికింద్రాబాద్‌కు మార్చింది. ఈ జోన్ పరిధిలోకి VSP, VJA, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి.

News February 5, 2025

ముంబైలో ‘లండన్ ఐ’ ఏర్పాటు చేస్తాం: BMC

image

లండన్‌లోని భారీ జెయింట్ వీల్ ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోనూ భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తాజాగా సమర్పించిన రూ.74వేల కోట్ల బడ్జెట్‌లో దాని గురించి ప్రస్తావించింది. ఇంకా స్థల సమీకరణ జరగని నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించలేదని వెల్లడించింది. ఏసీతో కూడిన క్యాప్సూల్‌లో ప్రయాణికులు ముంబై నగరాన్ని ఎత్తు నుంచి తిలకించవచ్చని పేర్కొంది.

News February 5, 2025

తీన్మార్ మల్లన్నపై వేటు?

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.