India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు. మీరూ ‘ఇంద్ర’ చూసేందుకు వెళ్లారా?
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు మధ్యవర్తులను సంప్రదించవద్దని TTD సూచించింది. టికెట్ల విషయంలో మధ్యవర్తిత్వం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తమిళనాడులోని ఓ ఇంటర్నెట్ ఆపరేటర్పై ఇలాగే కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అధికారిక వెబ్సైట్(ttdevasthanams.ap.gov.in) లేదా TTD మొబైల్ యాప్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ సాధారణంగా 5 రోజులు ఉంటుంది. కానీ శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 6 రోజుల టెస్ట్ జరగనుంది. కాకపోతే మధ్యలో ఒక రెస్ట్ డే ఉంటుంది. శ్రీలంకలోని గాలే వేదికగా తొలి టెస్ట్ Sept 18న ప్రారంభమై 23న ముగియనుంది. 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రోజున ‘రెస్ట్ డే’గా పరిగణించి ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. గతంలో టెస్టు మధ్యలో వచ్చే ఆదివారాన్ని రెస్ట్ డే అనేవారు.
TG: రూ.2లక్షలకు పైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయశాఖ అధికారులతో చర్చించారు. కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం కొత్త యాప్ తీసుకొచ్చామన్నారు. అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
దేశంలో ప్రతి ఊరుకో గుడి ఉండటం సహజం. అయితే, అత్యధికంగా గుళ్లు ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులో ఎక్కువగా 79,154 టెంపుల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 77,283, కర్ణాటకలో 61,232, వెస్ట్ బెంగాల్లో 53,658, గుజరాత్లో 49,995, ఆంధ్రప్రదేశ్లో 47,152, రాజస్థాన్లో 39,392, ఉత్తర్ప్రదేశ్లో 37,518, ఒడిశాలో 30,877, బిహార్లో 29,748, తెలంగాణలో 28,312, మధ్యప్రదేశ్లో 27,947 దేవాలయాలున్నాయి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త సారథిగా బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో మీటింగ్లో ఈమేరకు నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్కు కేంద్ర హోమంత్రి అమిత్ షా <
* NC అన్నట్టు JKకు ప్రత్యేక పతాకం ఉండాలన్నదే కాంగ్రెస్ కోరికా? * ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరించి టెర్రరిజం, అశాంతి పెంచుతారా? * టెర్రరిస్టులు, రాళ్లు విసిరేవాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా? * దళితులు, గుజ్జర్లు, బకర్వాలాలు, పహాడీల రిజర్వేషన్లు తొలగిస్తారా?
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అలర్ట్. చివరి మూడేళ్లలో 63% ఈక్విటీ ఫండ్స్ వాటి బెంచ్మార్క్ సూచీల్ని మించి రాబడి ఇవ్వడంలో విఫలమయ్యాయి. 213 ఫండ్స్లో 135 అండర్ పెర్ఫామ్ చేశాయి. 78 మాత్రమే మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. మిడ్క్యాప్ ఫండ్స్లో 80%, స్మాల్ క్యాప్లో 74, ఫ్లెక్సీ క్యాప్లో 69, ఫోకస్డ్లో 67, లార్జ్ క్యాప్లో 64, ELSSలో 56, మల్టీ క్యాప్లో 56, వాల్యూలో 19% ఫండ్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి.
AP: మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇటీవల ఏసీబీ అధికారులు ఆయనను <<13840826>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.
తన 75వ సినిమా షూటింగ్లో మాస్ మహారాజా గాయపడినట్లు సినీ వర్గాలు తెలిపాయి. చిత్రీకరణలో కుడి చేతికి గాయం కావడంతో యశోదా హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. రవితేజ కోలుకునేందుకు కనీసం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అటు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. RT75 చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.