news

News August 22, 2024

ఒత్తిడి వల్లే కాళేశ్వరం ఫైల్స్‌పై సంతకాలు: నరేందర్

image

TG: KCR, హరీశ్‌రావు ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్‌ల ఫైనల్ అప్రూవల్‌కు తాను సంతకాలు చేసినట్లు సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ‘ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే తప్పులు జరిగాయి. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ సరిగా చెక్ చేయలేదు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్అండ్‌టీ సంస్థ పాల్గొంది’ అని చెప్పారు.

News August 22, 2024

తెలంగాణ స్పోర్ట్స్ లోగో ఆవిష్కరించిన సీఎం

image

TG: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగోను సచివాలయంలో CM రేవంత్ ఆవిష్కరించారు. ‘జీవితం కోసం క్రీడలు’ అనే ట్యాగ్ లైన్‌తో జ్యోతి వెలుగులు జిమ్ముతున్నట్లుగా లోగోను రూపొందించారు. ఒలింపిక్స్ వంటి ప్రపంచ క్రీడా పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేసే ఛాన్సుంది.

News August 22, 2024

ప్రీ-రికార్డెడ్ కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్త: TRAI

image

ట్రాయ్ పేరుతో పలువురికి ప్రీ-రికార్డెడ్ కాల్స్, మెసేజ్‌లు రావడంపై వినియోగదారులను TRAI అప్రమత్తం చేసింది. ఇలాంటి కాల్స్ చేసి ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తామంటూ కొందరు దుండగులు వ్యక్తిగత సమాచారం కోరుతున్నారంది. ఇలా వచ్చే కాల్స్, మెసేజ్‌లు ఫేక్ అని, ఇలాంటి వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మొబైల్ కనెక్షన్ల రద్దుతో తమకు లింక్ లేదంది. అనుమానిత కాల్స్‌పై 1930 హెల్ప్‌లైన్ నంబర్, <>https://cybercrime.gov.in/<<>>కు ఫిర్యాదు చేయాలంది.

News August 22, 2024

ఇంగ్లండ్‌లో హర్మన్ సేన షెడ్యూల్ ఇదే

image

భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. సొంతగడ్డపై మహిళల 2025 సీజన్ షెడ్యూలును ఈసీబీ ప్రకటించింది. హర్మన్ సేన ఇంగ్లండ్‌తో 5 టీ20లు, 3 వన్డేల సిరీసుల్లో తలపడనుంది. జూన్ 28న నాటింగ్‌హామ్, జులై 1న బ్రిస్టల్, 4న ఓవల్, 9న మాంచెస్టర్, 12న ఎడ్జ్‌బాస్టన్లో టీ20లు ఉంటాయి. జులై 16, 19, 22న సౌతాంప్టన్, లార్డ్స్, దుర్హమ్‌లో వన్డేలు జరుగుతాయి. 2026లో లార్డ్స్‌ వేదిక ఒక టెస్టు ఉంటుంది.

News August 22, 2024

ఇమేజ్ మేకోవర్ పనిలో పడ్డ అదానీ!

image

బిలియనీర్ గౌతమ్ అదానీ తన ఇమేజ్ మార్చుకొనే పనిలో ఉన్నారని తెలిసింది. ఫ్యామిలీ ఆఫీసుల కోసం టాప్ ఆడిటింగ్ కంపెనీల నుంచి ఐదుగురు ఆడిటర్లు, ఒక సీఈవో, సీఐవోను నియమించుకుంటారని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీసు వ్యవహారాలను అనధికార బృందం చూసుకుంటోంది. ఇప్పుడు ప్రత్యేకంగా నిపుణులను తీసుకోనున్నారు. వీరు ఆడిటింగ్ చేపట్టి ఆర్థిక నివేదికలు ఇస్తారు. దీంతో తన పారదర్శకత, నిజాయతీ అందరికీ తెలుస్తాయని అదానీ భావన.

News August 22, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో గంటలో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హన్మకొండలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా? కామెంట్ చేయండి.

News August 22, 2024

‘స్టాక్ మార్కెట్’ మోసాలతో జాగ్రత్త: TG పోలీస్

image

‘స్టాక్ మార్కెట్’లో పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. నకిలీ లాభాలు చూపించి మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెడతారని, సర్వం దోచేశాక మొహం చాటేస్తారని తెలిపారు. అనధికార యాప్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News August 22, 2024

మ‌నోళ్లు విదేశీ ఖ‌ర్చులు త‌గ్గించేశారు

image

విదేశాల్లో భార‌తీయులు త‌మ ఖ‌ర్చుల‌ను భారీగా త‌గ్గించుకుంటున్న‌ట్టు RBI డేటా చెబుతోంది. కేంద్ర పన్నుల భారం వల్ల ఎక్స్‌ట‌ర్న‌ల్ రెమిటెన్స్(ER-విదేశాల‌కు పంపే డ‌బ్బు) క్రమంగా తగ్గిపోతున్నాయి. గ‌త ఏడాది జూన్‌లో $3.9 బిలియన్లు ఉండ‌గా, జూన్ 2024లో 44% తగ్గి $2.2 బిలియన్లకు పడిపోయాయి. భార‌తీయుల‌ విదేశీ ప్ర‌యాణాలు, విద్య‌, సంబంధీకుల ఖ‌ర్చుల‌కు పంపే నిధుల్లో తరుగుదల పన్నుల భారమే వల్లే అని స్పష్టమవుతోంది.

News August 22, 2024

పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ: సీఎం చంద్రబాబు

image

AP: పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. రెడ్ కేటగిరీ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఉమ్మడిగా పనిచేయాలి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం. ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవు’ అని అచ్యుతాపురం ఘటనపై వ్యాఖ్యానించారు.

News August 22, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘వాయిస్ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల వాయిస్ మెసేజ్‌లు టెక్స్ట్ రూపంలో కనిపిస్తాయి. ఆడియో వినలేని సందర్భంలో టెక్స్ట్ చదువుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో చాట్స్‌కు వెళ్లి ట్రాన్‌స్క్రిప్షన్ ఆఫ్/ఆన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రస్తుతం ఇది కొందరికే కనిపిస్తోంది. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, రష్యన్, పోర్చుగీసు భాషలకు సపోర్ట్ చేస్తోంది.

error: Content is protected !!