India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఒక మాజీ MLA తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని జగన్ విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ‘పెద్దారెడ్డి SPకి సమాచారం ఇచ్చి వెళ్లినా TDP మూకలు అడ్డుకున్నాయి. ఆయన ఇంటిని తగలబెట్టి, వాహనాలను ధ్వంసం చేశాయి. ఇన్ని దారుణాలు జరుగుతుంటే నేరం చేయాలంటేనే భయపడాలంటూ CBN కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?’ అని Xలో ఫైరయ్యారు.
TG: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం కోతలతో రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. చేవెళ్లలో BRS నేతల ధర్నాలో ఆయన మాట్లాడారు. హామీల అమలు గురించి అడిగితే నిండు సభలో సబితను అవమానించారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఓట్లు వేసి అమలు చేయకుండా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు.
AP: అచ్యుతాపురం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ ప్రభుత్వంలో తెచ్చిన ప్రమాణాలను అటకెక్కించారని YCP విమర్శించింది. ప్రజల శవాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ మండిపడింది. వైసీపీ హయాంలో 16 ఘటనలు జరిగి 70 మంది చనిపోయారని, ఇవేనా మీరు తెచ్చిన భద్రతా ప్రమాణాలు అని కౌంటర్ ఇచ్చింది.
AP: అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని CM చంద్రబాబు అన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ‘గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. వాటిని బాగుచేసే క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. 17 మంది చనిపోయారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తాం’ అని తెలిపారు.
TG: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వాన పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై CBI సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన ఐదురోజుల తరువాత తాము దర్యాప్తు ప్రారంభించే సమయానికి సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించింది. గురువారం సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసులో బాధితురాలి మృతదేహాన్ని దహనం చేసిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సాక్ష్యాలను కప్పిపుచ్చారని పేర్కొంది.
AP: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంద్ర సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా 175 రోజుల వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వేడుకల్లో అప్పటి యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, సునీల్, లారెన్స్, AVSతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ వేడుకల్లో పాల్గొన్నారు.
AP: YS జగన్ వల్లే ఎసెన్షియా ఫార్మా ప్రమాదం జరిగిందని <<13914396>>ఆరోపించిన<<>> టీడీపీపై వైసీపీ మండిపడింది. ‘ప్రమాదం తర్వాత చర్యలు తీసుకోకుండా చంద్రబాబు తెల్లముఖం వేస్తున్నారు. మీ చేతగానితనాన్ని జగన్పై నెట్టే దిక్కుమాలిన ప్రయత్నాలు మానుకోండి. పరిశ్రమల కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించింది జగనే. కంపెనీల్లో భద్రతపై చంద్రబాబు ఏనాడైనా సమీక్షించారా?’ అని Xలో నిలదీసింది.
తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. కవిత వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా రేపు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.