India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఢిల్లీలో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయాలని కోరారు. AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు.

TG: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపటి నుంచి హైదరాబాద్లో శిక్షణ ప్రారంభమవనుంది. వీరి శిక్షణ ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కాగా ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.

తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో నటిస్తున్నారు.

ప్రయాగ్రాజ్లో గడ్డ కట్టే చలిలోనూ అఘోరాలు, నాగ సాధువులు ఒంటిపై నూలు వస్త్రం కూడా లేకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగసాధువులు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘సాధన చేసినప్పుడు చలి అనేదే ఉండదు. బూడిదను శరీరానికి రాసుకుంటాం కాబట్టి చలి తక్కువేస్తుంది. దీనివల్ల రోగాలు కూడా రావు. జపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే అతిపెద్ద వస్త్రం. ఇంకేం వస్త్రాలు అక్కర్లేదు’ అని తెలిపారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ AP ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్పై రూ.50(జీఎస్టీతో కలిపి) వరకు, మల్టీఫ్లెక్సుల్లో రూ.75(జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చని తెలిపింది. సినిమా రిలీజైన వారం వరకు ఈ ధరలు కొనసాగుతాయని చెప్పింది. ‘తండేల్’ మూవీ ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.

TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.

నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఈ నెల 13న ట్రంప్తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోదీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

KBCలో రూ.5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గుర్తున్నాడా? 2011లో ఈయన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ, ఆయన విజయం కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్గా మారారు.
Sorry, no posts matched your criteria.