news

News August 8, 2024

తెలంగాణలో రేషన్ కార్డులపై సబ్‌కమిటీ

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా మంత్రులు దామోదర రాజ నర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

News August 8, 2024

వారికి రూ.10,000 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానం చేసిన వారి పార్థివదేహాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్/సీనియర్ అధికారి ఈ సంస్కారాల్లో పాల్గొనాలని ఆదేశించింది. దాతల కుటుంబాలకు ₹10,000 పారితోషికం, ప్రశంసా పత్రాలు అందించాలని మంత్రి స‌త్య‌కుమార్ చొర‌వ‌తో ఉత్తర్వులు ఇచ్చింది. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి భౌతికకాయం ఉచితంగా తరలించాలంది.

News August 8, 2024

రోజుకు ఎన్ని కోడిగుడ్లు తినాలంటే?

image

రోజూ కోడిగుడ్డు తినడం ఆరోగ్యకరమని తెలుసు. కానీ, ఎన్ని గుడ్లు తినాలనే సందేహం చాలా మందిలో నెలకొంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుంది. డయాబెటిక్ రోగులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినొద్దు. కోడి గుడ్లు ఉడకబెట్టడానికి కూడా 12 నుంచి 15 నిమిషాలు మరిగించాల్సి ఉంటుంది. తక్కువ సేపు ఉడకబెడితే పచ్చ& తెల్ల సొన పూర్తిగా బాయిల్ అవ్వదు.

News August 8, 2024

కర్ణాటకతో 7 అంశాలపై AP ఒప్పందం

image

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో ఆ రాష్ట్రంతో 7 అంశాలపై ఒప్పందం జరిగింది. 8 కుంకీ ఏనుగులు APకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. కర్ణాటక పట్టుకున్న ఎర్రచందనం అప్పగింత, ఎకో టూరిజం అభివృద్ధి, శాటిలైట్ నిఘాతో అటవీ సంపదను రక్షించుకోవడం, వేటగాళ్లను నియంత్రించడం, వన్యప్రాణుల వేట విషయంలో ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని, అడవుల రక్షణపై సమిష్టిగా ముందుకెళ్లాలని పవన్ ఒప్పందాలు చేసుకున్నారు.

News August 8, 2024

భారత్‌కు కాంస్యం.. మోదీ, రాహుల్ హర్షం

image

ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ కాంస్య పతకం సాధించడంపై PM మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ‘తరాలపాటు గుర్తుండిపోయే విజయమిది. వరుసగా రెండో కాంస్యం సాధించడం మరింత ప్రత్యేకం. పట్టుదల, టీమ్ స్పిరిట్ ఈ గెలుపునకు కారణం’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడం గర్వంగా ఉంది. రాజీలేని నీ పోరాటానికి ధన్యవాదాలు శ్రీజేశ్’ అని రాహుల్ కొనియాడారు.

News August 8, 2024

Olympicsలో భారత హాకీ ప్రస్థానం

image

* అమ్‌స్టర్‌డ్యామ్(1928)-గోల్డ్
* లాస్ ఏంజెలిస్(1932)-గోల్డ్
* బెర్లిన్(1936)-గోల్డ్, * లండన్(1948)-గోల్డ్
* హెల్సింకీ(1952)-గోల్డ్, * మెల్‌బోర్న్(1956)-గోల్డ్
* రోమ్(1960)-సిల్వర్, * టోక్యో(1964)-గోల్డ్
* మెక్సికో(1968)-బ్రాంజ్, * మునిచ్(1972)-బ్రాంజ్
* మాస్కో-(1980)-గోల్డ్
* టోక్యో(2020)-బ్రాంజ్
* పారిస్(2024)-బ్రాంజ్

News August 8, 2024

గుడిలో ప్రదక్షిణం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

image

గుడిలో ఎందుకు క్లాక్ వైజ్‌లోనే ప్రదక్షిణం చేస్తారో తెలుసా? ప్రదక్షిణం చేసే వ్యక్తికి మూలవిరాట్టు ఎప్పుడూ కుడివైపుగా ఉండాలి కాబట్టి. ఒకవేళ ఎడమవైపు వచ్చేలా నడిస్తే దానిని అప్రదక్షిణం అంటారు. వయసులో పెద్దవారికి సైతం కుడివైపునే నిల్చోవాలంటారు. అందుకే తనకంటే పెద్దవారైన భర్త తనకు కుడివైపున ఉండేలా భార్య నిల్చుంటుంది. అయితే, శివాలయంలో ప్రదక్షిణల తీరు వేరుగా ఉంటుంది. రేపు ఆ విషయాన్ని తెలుసుకుందాం.

News August 8, 2024

JAI HIND: రేపటి నుంచి ఇలా చేయండి..

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈనెల 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

News August 8, 2024

వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థిరాస్తులివే!

image

వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా 8,72,324 ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 27%( 2,32,547), బెంగాల్‌లో 9%(80,480), తెలంగాణలో 5% (45,682) ప్రాపర్టీలు కలిగి ఉంది. ఈ డేటాను వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది.

News August 8, 2024

అలా జరిగితే ఫొగట్‌కు సిల్వర్ మెడల్!

image

ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌‌ను డిస్‌క్వాలిఫై చేయడంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ విచారణ చేపట్టింది. ఈక్రమంలో తన బరువును మరోసారి కొలవాలని COAను ఆమె అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను స్వతహాగా మూడు మ్యాచులు గెలిచి ఫైనల్‌కు వచ్చానని, తనకు సిల్వర్ మెడల్ ఇప్పించాలని ఆమె కోరారు. దీనిపై 48 గంటల్లో COA సమాధానమివ్వనుంది. అనుకూలంగా తీర్పు వస్తే ఫొగట్‌కు సిల్వర్ దక్కనుంది. HOPE FOR THE BEST

error: Content is protected !!