India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజస్థాన్, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీలపై అధ్యయనానికి అధికారుల బృందాలను పంపనుంది. అక్కడి బార్లు, మద్యం ధరలు, కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ప్రభుత్వానికి ఈ నెల 12లోగా అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం తెచ్చేలా GOVT ప్రణాళికలు రచిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్2024 ప్రయాణం అందంగా ఉన్నా తన ఓటమి బాధను మిగిల్చిందని బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అన్నారు. ‘ఈ ఓటమి నా కెరీర్లో అత్యంత బాధాకరమైనది. దీని నుంచి బయటపడేందుకు టైమ్ పడుతుంది. గాయాలతో చాలాకాలం ఆటకు దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. దేశానికి ఒలింపిక్స్లో మూడో సారి ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. చిన్న విరామం తర్వాత నా ఆటను కొనసాగిస్తా’ అని ఆమె ట్వీట్ చేశారు.
పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పరిశీలిస్తోంది. వీరిలో ఐదుగురు IASలు, ఒక IRS ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని UPSC ఇప్పటికే రద్దు చేసింది. ఆమె దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని సెకండ్ సింగిల్ను ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్తో ఎన్టీఆర్ స్టెప్పులేసిన ఫొటోను రిలీజ్ చేశారు. ఇందులో తారక్ లుక్ ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘దేవర’ పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మనూ భాకర్ సత్తా చాటుతున్నారు. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ఫైనల్స్కు దూసుకెళ్లారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగాల్లో ఇప్పటికే ఆమె కాంస్య పతకాలు సాధించారు. <<-se>>#Olympics2024<<>>
ఢిల్లీ IAS స్టడీ సర్కిల్ బేస్మెంట్లో అభ్యర్థుల మరణాల కేసును హైకోర్టు CBIకి బదిలీ చేసింది. SUV డ్రైవర్ అరెస్టుపై సీరియస్ అయింది. ‘ముగ్గురి మరణానికి కారణమైన వరద నీటిపై పోలీసులు చలాన్ వేయకపోవడం నిజంగా అతిపెద్ద రిలీఫ్’ అని వ్యంగ్యస్త్రాలు సంధించింది. ‘ఇందులో చాలామంది సీనియర్ అధికారుల జోక్యం ఉండొచ్చు. ఘటన తీరును బట్టి ప్రజల్లో సందేహాలు రావొద్దనే దర్యాప్తును CBIకి అప్పగిస్తున్నాం’ అని కోర్టు తెలిపింది.
అట్లిస్ CEO మోహక్ ప్రకటించిన ఫ్రీ వీసా ఆఫర్ SMలో బజ్ క్రియేట్ చేసింది. ‘ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ప్రతి ఒక్కరికీ ఫ్రీగా వీసా పంపిస్తా’ అని జులై 30న ఆయన లింక్డిన్లో పోస్టు పెట్టారు. వెంటనే.. ఫ్రీగా ఇస్తారా? ఎందరికి ఇస్తారు? వివరాలేంటని ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో ‘ఒకరోజు ఒకరికి ఒక ఫ్రీ వీసా ఇస్తాను’ అని ఆయన జవాబిచ్చారు. ప్రతిదీ ప్రచారం కోసమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
TG: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా చూసే బాధ్యత తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు. మెరుగైన విద్య, వైద్యం అందించడం వల్లే ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు గెలిచారని గుర్తు చేశారు.
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 331కి చేరినట్లు తెలుస్తోంది. శిథిలాలు వెలికితీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంపై సహాయక బృందాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 400 దాటొచ్చని అంచనా. మరోవైపు 200 మందికిపైగా గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 116 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Sorry, no posts matched your criteria.